logo

Biryani: రూపాయి బిర్యానీ.. ఎగబడిన జనం

రూపాయి బిర్యానీకి జనం ఎగబడ్డారు. పిల్లలు .. యువకులు ..వృద్ధులు ఇలా అందరూ పోటీపడడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Updated : 07 Apr 2023 07:17 IST

రెస్టారెంట్‌ వద్ద పెద్దఎత్తున గుమిగూడిన మార్కాపురం వాసులు

మార్కాపురం: రూపాయి బిర్యానీకి జనం ఎగబడ్డారు. పిల్లలు .. యువకులు ..వృద్ధులు ఇలా అందరూ పోటీపడడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మార్కాపురం పట్టణంలో గురువారం ఓ ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పాత రూపాయి నోట్‌కు దమ్‌ బిరియానీ అని ప్రకటించడంతో జనం పెద్దఎత్తున వచ్చారు. తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసి నిలిపేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మార్కాపురం - కంభం రహదారిపై ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని