ఏరువాక.. కాగితాలకెక్కిన ప్రణాళిక
ఈ ఏడాది ఖరీఫ్కు జిల్లా వ్యవసాయ శాఖ కాగితాలపై ప్రణాళికను సిద్ధం చేసుకుంది. గత అనుభవాలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని చూస్తోంది.
ఖరీఫ్కు వ్యవసాయ శాఖ సన్నద్ధం
1.90 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం
పంపిణీకి విత్తనాలు, ఎరువులు సిద్ధం
ఈనాడు డిజిటల్, ఒంగోలు: ఈ ఏడాది ఖరీఫ్కు జిల్లా వ్యవసాయ శాఖ కాగితాలపై ప్రణాళికను సిద్ధం చేసుకుంది. గత అనుభవాలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని చూస్తోంది. వాతావరణం అనుకూలిస్తే గతేడాదికంటే అధికంగా పంటలు సాగు చేస్తారనే అంచనాతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధం చేస్తోంది. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 2022 ఖరీఫ్లో 1,69,825 హెక్టార్లలో సాగయ్యాయి. ఈ ఏడాది మరింత విస్తీర్ణం పెంచి 1,90,042 హెక్టార్లలో సాగు చేయాలని నిర్ణయించింది. ప్రధాన పంటల్లో అత్యధికంగా కంది 80 వేల హెక్టార్లలో, పత్తి 33 వేలు, మిర్చి 28 వేలు, పొగాకు 1,725 హెక్టార్లలో సాగు చేయనున్నట్టు చెబుతోంది. అదే సమయంలో చిరుధాన్యాల సాగును పెంచేలా యోచిస్తున్నారు. మర్రిపూడి, వెలిగండ్ల, తాళ్లూరు, సీఎస్పురం, గిద్దలూరు, కొమరోలు మండలాల్లో సజ్జ 14,466, కొర్ర 2,224 హెక్టార్లలో సాగు చేయించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. కౌలు రైతులకు ఇచ్చే కార్డుల సంఖ్య ఈసారి పది వేలు పెంచారు. బ్యాంకుల నుంచి సాగు, పంట రుణాలు కూడా రూ.5 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్బీకేల ద్వారా అందజేత...: 4,200 క్వింటాళ్ల వరి విత్తనాలను ఆర్బీకేల్లో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. క్వింటాకు రూ.500 రాయితీ లభించనుంది. కందులు 1,200, మినుము 1,000, పెసర 300 క్వింటాళ్లను 30 శాతం రాయితీపై రైతులకు అదించనున్నారు. కొర్ర 72, అరికలు 2.80 క్వింటాళ్లు, జీలుగ 1700, పిల్లిపెసర 1,275, పచ్చిరొట్ట 1,275 క్వింటాళ్లు 50 శాతం రాయితీపై ఇస్తారు. ఖరీఫ్కు సంబంధించి పత్తి విత్తనాలు 1.50 లక్షల సంచులు, మిరప 17.50 కిలోల విత్తనాలు పది గ్రాముల సంచుల్లో సిద్ధం చేసి అందించనున్నారు.
ఎరువులు ఎంత కావాలంటే...: అన్ని రకాల ఎరువులు 59 వేల టన్నుల వరకు అవసరం అని అంచనా. పాతవి, ఈ నెల 19 వరకు వచ్చిన వాటితో కలిపి మొత్తం 28,995 టన్నులు అందుబాటులో ఉన్నాయి. 3,709 టన్నులు ఇప్పటికే రైతులు కొనుగోలు చేయగా ఇంకా 25,286 టన్నులు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నెలల వారీగా ఆయా ఆర్బీకేలకు కేటాయించి రైతులకు అందించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో యూరియా 6816, డీఏపీ 2,798, ఎంవోపీ 185, ఎన్పీకేఎస్ 6944, ఎస్ఎస్పీ 425 టన్నులు రైతులకు అందించనున్నారు.
చిరు ధాన్యాల విస్తీర్ణం పెంచుతాం...
గతేడాది కంటే ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం పెరగనుంది. ప్రధాన పంటల స్థానంలో చిరుధాన్యాల సాగును పెంచేలా కార్యాచరణ రూపొందించాం. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తాం. అవసరం అయిన రైతులు ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాలి.
శ్రీనివాసరావు, జేడీఏ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!