నేత్రపర్వం.. లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవం
దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
అంకురార్పణతో వేడుకలు ప్రారంభం
ప్రత్యేక అలంకరణలో స్వామివారు
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి వేద పండితులు అంకురార్పణతో ప్రారంభించి, బుధవారం ఉదయం ధ్వజారోహణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను చంద్రప్రభ వాహనంపై గ్రామ వీధుల్లో భక్తులు ఊరేగించారు. 11 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని ధ్వజ స్తంభానికి గరుడ పటాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి సేవ చేసేందుకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం సంప్రదాయమని ప్రధాన అర్చకులు వేంకట లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. గరుత్మంతుడు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సత్కారాలు చేస్తూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారన్నారు. దోషాల వల్ల సంతానం కలగని మహిళలకు గరుత్మంతుని ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకమన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ మాధవరావు, ఈవో కృష్ణవేణి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని