ఎండిన తోటలు.. గుండెల్లో దిగులు
జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, త్రిపురాంతకం, తాళ్లూరు, కంభం, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో 1520 హెక్టార్లలో బత్తాయి సాగవుతోంది. ప్రతి వేసవిలో వచ్చే కాపుతోనే రైతులు నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు.
వడగాలులతో దెబ్బతిన్న బత్తాయి
పెట్టుబడీ రాని దీనస్థితి
ప్రభుత్వం కొనుగోలుచేస్తేనే గట్టెక్కేది
వెలిగండ్లలో ఎండిపోయిన బత్తాయి చెట్టు
జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో బత్తాయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. నీటి తడులు అందక చెట్లు మాడిపోయి రైతులు కుంగిపోతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి.. కాయ నాణ్యత దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
కనిగిరి, న్యూస్టుడే: జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, త్రిపురాంతకం, తాళ్లూరు, కంభం, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు గిద్దలూరు, దర్శి ప్రాంతాల్లో 1520 హెక్టార్లలో బత్తాయి సాగవుతోంది. ప్రతి వేసవిలో వచ్చే కాపుతోనే రైతులు నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావం, పైగా ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి చెట్లకు నీరందలేదు. ఈ బెట్ట పరిస్థితుల్లో తోటలను కాపాడుకునేందుకు 700 అడుగుల లోతులో బోర్లు వేసినా నీళ్లు పడ లేదు. దీంతో పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక అన్నదాతలు దిగాలు చెందుతున్నారు.
ఓ పక్క బెట్ట.. మరోవైపు రేటు లేక..
తీవ్ర వర్షాభావంతో తెగుళ్లు సోకి..
జిల్లావ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నా బత్తాయిని అధికంగా సాగు చేసే పశ్చిమ ప్రకాశంలో మాత్రం చిరు జల్లులు కూడా పడలేదు. దీంతో బెట్ట పరిస్థితులు ఏర్పడి కాయలు వాడిపోతున్నాయి. వాస్తవంగా వేసవిలో బత్తాయికి మంచి రేటు ఉంటుంది. పశ్చిమ బంగ, కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్రతో పాటు పక్కనే ఉన్న బంగ్లాదేశ్కు అధికంగా ఎగుమతి అవుతుంటాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెల మొదటి వారం వరకు కాయలు పక్వానికి వచ్చి మంచి రేటు పలికాయి. అక్కడి నుంచే పరిస్థితి తల్లకిందులైంది. ఒక్కసారే ఎండలు మండిపోవడంతో కాయ సైజు తగ్గిపోయింది. కొన్నిచోట్ల చెట్లకే వాడిపోయి రసం తగ్గిపోయింది. దీంతో కాయ నాణ్యత లేదంటూ వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. రేటు కూడా భారీగా తగ్గిపోయింది. వాస్తవంగా మే నెలలో టన్ను రూ. 40వేలు పలకాల్సిన బత్తాయి ప్రస్తుతం రూ. 25 వేలకు మించి రావడం లేదు. అసలే అప్పులు చేసి చెట్లను కాపాడుకున్నామని, రేటు కూడా లేకపోతే ఎలా బతకాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తెగుళ్లు కూడా సోకుతున్నాయని వారంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు కల్పించాలని కోరుతున్నారు.
కొనుగోలు చేయడం లేదు
కనిగిరిలో గిడసబారి సైజు తగ్గిన బత్తాయి
ప్రస్తుత ఎండల వల్ల బత్తాయి చెట్లు బెట్టకు వచ్చాయి. నేను 15 ఎకరాల్లో సాగు చేశా. ఎకరాకు సుమారు రూ. 50 వేలకు పైగానే పెట్టుబడి పెట్టా. వాస్తవంగా మే నెలలో టన్ను ధర రూ. 40 వేలకు పైగా ఉంటుంది. ఈ సారి కాయ గిడస బారిపోవడం, నీటి శాతం తగ్గడంతో రేటు తగ్గించేశారు. కాయ పరిమాణం సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వమే స్పందించి రైతుల నుంచి కొనుగోలు చేసి ఆదుకోవాలి.
- గురవారెడ్డి, రైతు వెలిగండ్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
మనసున్న డాక్టరమ్మ
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
సారా‘క్షసులు’
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు