logo

హంస వాహనంపై నరసింహుడు

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ నరసింహస్వామి ఆలయంలో  బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Published : 02 Jun 2023 05:45 IST

గ్రామోత్సవంలో నరసింహ స్వామి

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ నరసింహస్వామి ఆలయంలో  బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామి వారి ఉత్సవమూర్తులను చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గురువారం రాత్రి స్వామి వారిని హంస వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ మాధవరావు, ఈవో కృష్ణవేణి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని