logo

మహానాడులో ప్రసంగించానని దూషణలు

రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన మహానాడు అనంతరం సామాజిక మాధ్యమాల్లో కొందరు తనపై వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని తెదేపా ప్రొఫెషనల్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని తెలిపారు.

Published : 03 Jun 2023 02:21 IST

ఎస్పీ మలికాగార్గ్‌కు వినతిపత్రం అందిస్తున్న తేజస్విని

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన మహానాడు అనంతరం సామాజిక మాధ్యమాల్లో కొందరు తనపై వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని తెదేపా ప్రొఫెషనల్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని తెలిపారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహానాడులో తాను ప్రసంగించిన అనంతరం కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అందుకు సంబంధించి కొన్ని క్లిప్పింగులను అందజేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని