బంగారు గొలుసుల చోరీ ముఠా అరెస్టు
వరండాల్లో నిద్రిస్తున్న మహిళల మెడలోంచి బంగారు గొలుసులు చోరీ చేసే ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రామరాజు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐలు కృష్ణపావని, ప్రసాద్
కనిగిరి, న్యూస్టుడే: వరండాల్లో నిద్రిస్తున్న మహిళల మెడలోంచి బంగారు గొలుసులు చోరీ చేసే ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల వీరారెడ్డిపల్లిలో ఈ తరహా దొంగతనానికి పాల్పడిన ముగ్గురు పాత నేరస్థులను కనిగిరి, హనుమంతునిపాడు, పీసీపల్లి పోలీసులు స్థానిక గుడిపాటిపల్లి వెళ్లే రోడ్డులో శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 20 గ్రాముల బరువున్న రూ. లక్ష విలువచేసే బంగారు గొలుసుతో పాటు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ రామరాజు వివరాలు వెల్లడించారు. పొదిలి గ్రామానికి చెందిన పొన్నర్సు అంజయ్య, పొన్నర్సు నరేష్, పొన్నర్సు ఏసుదాసు పాత నేరస్థులు. వీరు ఆధార్ కార్డులో ఇంటి పేర్లు మార్చుకుని పిల్లులను పట్టుకుని జీవిస్తున్నట్లు నటించి దొంగతనానికి అనువైన ఇంటిని గుర్తిస్తారు. అనంతరం రాత్రి వేళ వచ్చి చోరీ చేసి ఉడాయిస్తారు. గత నెల 26 రాత్రి హనుమంతునిపాడు మండలం వీరారెడ్డిపల్లిలోని ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఉడుమల ఆదిలక్ష్మమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో ద్విచక్ర వాహనంపై ముగ్గురు పరారయ్యారు. దీంతో ఆమె మెడ వద్ద గాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చినట్లు చెప్పారు. వీరిపై గతంలో పలు దొంగతనాల కేసులున్నాయి. కేసును త్వరితగతిన ఛేదించిన కనిగిరి సీఐ శివరామకృష్ణారెడ్డి, హనుమంతునిపాడు, కనిగిరి, పీసీ పల్లి ఎస్ఐలు జి.కృష్ణపావని, దాసరి ప్రసాద్, ఎ.నాగేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
రత్తయ్య(పాత చిత్రం)
యర్రగొండపాలెం, న్యూస్టుడే: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వై.పాలెం మండలం కొలుకులలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు ఒంటేరు రత్తయ్య(59) తనకున్న ఎకరాన్నర పొలంతో పాటు పక్కనే ఉన్న మరో అయిదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశారు. మూడేళ్లుగా నష్టాలే తప్ప పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో తెలిసిన వాళ్ల వద్ద, బంధువుల దగ్గర సాగు కోసం చేసిన అప్పులు రూ.13 లక్షలకు చేరాయి. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఎలా తీర్చాలో అతనికి దిక్కుతోచలేదు. గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రత్తయ్యకు భార్య గంగాదేవి, ఇద్దరు కుమారులున్నారు.
నవ వధువు బలవన్మరణం
కొత్తపట్నం, న్యూస్టుడే: కొత్తపట్నం మండలం రెడ్డిపాలేనికి చెందిన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వైష్ణవి(19)కి లింగసముద్రం మండలం యర్రారెడ్డిపాలేనికి చెందిన భాస్కర్రెడ్డితో పద్దెనిమిది రోజుల క్రితమే వివాహమైంది. ఇటీవల పుట్టింటికి వచ్చిన ఆమె... శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
ఏడుకొండలు (పాత చిత్రం)
చీమకుర్తి, న్యూస్టుడే: పొలానికి నీరు పెట్టి, మోటారు స్విచ్ ఆపే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. చీమకుర్తి మండలం బి.నాయుడుపాలెంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గామానికి చెందిన దద్దాల ఏడుకొండలు (43) పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. పైరుకుని నీరు పెట్టడం పూర్తయ్యాక మోటారు స్విచ్ ఆపే క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని వారు గుర్తించి వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య గంగమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబీకులు రోదించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఎస్సై జి.రామిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరీక్షకు పంపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ... చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని సరస్వతి డిగ్రీ కళాశాల సమీపంలో నివాసముంటున్న కందుకూరి పార్వతి (45)... గురువారం సాయంత్రం, కుండీలో చెత్త వేసేందుకు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె మృతి చెందారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించి సీజ్ చేశారు. ఎస్సై అంకమ్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
[ 28-03-2024]
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. -
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి
[ 28-03-2024]
టంగుటూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
తలుపు తట్టనున్న ఓటు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. -
రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం
[ 28-03-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
దర్శి బరిలో నిలిచేదెవరు!
[ 28-03-2024]
జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. -
త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్షోలు
[ 28-03-2024]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్కల్యాణ్ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
కీలుబొమ్మల స్వామిభక్తి
[ 28-03-2024]
ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. -
ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
[ 28-03-2024]
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. -
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. -
భారీగా అక్రమ మద్యం స్వాధీనం
[ 28-03-2024]
అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం
[ 28-03-2024]
ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. -
విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి
[ 28-03-2024]
పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒంగోలు ఆర్వోపై కలెక్టర్ ఆగ్రహం
[ 28-03-2024]
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ప్రతిష్ఠా మహోత్సవం
[ 28-03-2024]
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సంతనూతలపాడులో బుధవారం కనులపండువగా నిర్వహించారు. -
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
[ 28-03-2024]
పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. -
జీజీహెచ్లో రోగుల భోజనంపై విచారణ
[ 28-03-2024]
సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్ విభాగం అధికారులు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్