గుప్త నిధుల ముఠా పనేనా!
ఉదయగిరి దుర్గం కొండపై ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 31న దుర్గం కొండపై ఉన్న చిన్న మసీదు ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది.
ఉదయగిరి దుర్గంపై తవ్వకాలు
పేలుడు సమయంలో మృత్యువాత
శవాన్ని మూటగట్టి వదిలిన దుండగులు
ఉప్పు శ్రీను (పాత చిత్రం)
పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఉప్పు శ్రీను(35) ఉదంతం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. గుర్తుతెలియని వ్యక్తులు అతని మృతదేహాన్ని మూటగట్టి కారులో తెచ్చి ఇంటి ఎదుట రహదారిపై వదిలి వెళ్లారు. ఈ సంఘటన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చింది. దీంతో ఘటనపై అనుమానాలు రేకెత్తాయి. ఓ గుప్త నిధుల ముఠా పనిగా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఉదయగిరి, పుల్లలచెరువు- న్యూస్టుడే:ఉదయగిరి దుర్గం కొండపై ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 31న దుర్గం కొండపై ఉన్న చిన్న మసీదు ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఇందులో పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పు శ్రీను కూడా ఉన్నారు. తవ్వకాల్లో భాగంగా బాంబులను పేల్చారు. ఈ సమయంలో శ్రీను ఆ ప్రదేశానికి సమీపంలో ఉండటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో ముఠా సభ్యులు అతని మృతదేహాన్ని మూటకట్టి గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల ఒకటో తేదీ అర్ధరాత్రి కారులో అతని స్వగ్రామమైన ముటుకులకు తీసుకెళ్లారు. అతని ఇంటి ఎదుట శవాన్ని పడేసి కారును వేగంగా వెనక్కి మళ్లించుకుని పారిపోయారు.
*సంఘటనా స్థలానికి పోలీసులు..: మూటను ఇంటి వద్ద పడేసి కారు వేగంగా వెళుతున్న విషయాన్ని అదే వీధిలో నిద్రిస్తున్న కొందరు గమనించారు. తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. ఇంటి యజమాని లింగాలును నిద్రలేపి చూపగా తన కుమారుడు శ్రీనుగా గుర్తించారు. మూటతో పాటు అందులో రూ. 35 వేల నగదు, ఓ లేఖ కనిపించింది. ఆ లేఖలో ‘మీ పిల్లాడిని మావద్దకు పనికి పంపారు. పని చేసే క్రమంలో ప్రమాదవశాత్తు మీ కుమారుడు చనిపోయాడు. మాకు కూడా గాయాలయ్యాయి. మట్టి ఖర్చుల కోసం రూ. 35 వేలు ఇస్తున్నాం. పిల్లల బాధ్యతను కూడా ఎంతో కొంత మేం తీసుకుంటాం...’ అని ఉన్నట్లు తెలిసింది. పని కోసమని వెళ్లిన శ్రీను విగతజీవిగా మారటం... అసలు అతను ఎలా చనిపోయారన్న విషయం తెలియకపోవటం.. మూటలో మృతదేహాన్ని కట్టి ఇంటి వద్దకు తెచ్చి ఎవరు పడేశారనేది అంతుచిక్కకపోవడం.. దీనికితోడు ఇది హత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం కూడా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలవరపాటుకు గురయ్యారు. శ్రీను మృతి విషయం సంచలనంగా మారటంతో పుల్లలచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శ్రీను ఉదయగిరి కొండపై గుప్తనిధుల తవ్వకాలకు వెళ్లి మృతిచెందినట్లు తెలుసుకున్నారు. పుల్లలచెరువు, పెద్దారవీడు ఎస్సైలు తమ సిబ్బందితో శనివారం ఉదయగిరి వెళ్లారు. అక్కడి సీఐ వి.గిరిబాబు సహకారంతో ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ముఠాలో ఎవరెవరున్నారే విషయాలపై ముమ్మర విచారణ చేపట్టారు. ఉదయగిరి దుర్గంపై ఉన్న చిన్న మసీదు ప్రాంతానికి ఆదివారం పోలీసుల బృందం వెళ్లనుందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?