మన్ను తింటూ.. ముప్పు తెస్తున్నారు
పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాదీపం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. ఈ జలాశయానికి సంబంధించిన ఆనకట్ట అర్థవీడు మండలం కాకర్ల వద్ద నిర్మించారు.
వెలిగొండ ఆనకట్ట రహదారి మీదుగా తరలివెళ్తున్న మట్టి ట్రాక్టర్
అర్థవీడు, న్యూస్టుడే: పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాదీపం పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. ఈ జలాశయానికి సంబంధించిన ఆనకట్ట అర్థవీడు మండలం కాకర్ల వద్ద నిర్మించారు. అసైన్డ్ మినహా ఇప్పటికే భూములను సేకరించారు. వీటి పరిరక్షణ బాధ్యతను ప్రాజెక్ట్ నీటిపారుదల విభాగం అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. ఈ భూములతో పాటు ఆనకట్ట సమీపంలోని పెద్దవాగు వద్ద ఎర్రమట్టి దిబ్బలు, పొలాలున్నాయి. ఇక్కడ లభించే మట్టి నాణ్యమైనదిగా పేరు. అధికారుల పర్యవేక్షణ అంతగా లేకపోవడంతో ఇప్పుడు ఎర్రమట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. జేసీబీ సాయంతో ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లకు నింపి విక్రయిస్తున్నారు. దూరాభారాన్ని బట్టి ట్రిప్పునకు రూ. 2 వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ప్రాజెక్టు ఆనకట్టకు కూతవేటు దూరంలోనే ఈ తతంగమంతా సాగుతున్నప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ప్రాజెక్ట్ ఆనకట్ట రహదారి మీదుగా మొహిద్దీన్పురానికి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టి తరలించారు. అయినా అడ్డుకున్నవారు కనిపించలేదు. చివరికి స్థానికులు స్పందించి ప్రాజెక్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కదలక తప్పలేదు. ఇదే విధంగా తవ్వకాలు కొనసాగితే ఆనకట్టకూ ముప్పు తప్పదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వెలిగొండ ప్రాజెక్ట్ నీటిపారుదల విభాగం జేఈ రమణారెడ్డి మాట్లాడుతూ.. మట్టి తరలిస్తున్నట్టు తెలుసుకుని అడ్డుకున్నట్లు చెప్పారు. తవ్వకాలు చేపట్టిన ప్రాంతాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.