logo

బిగించి.. చేతులు దులుపుకొని...

విద్యుత్తు ప్రమాదంలో కాలిపోయిన డయాలసిస్‌ పరికరాలను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ గత నెల 2న పరిశీలించారు. వెంటనే విద్యుత్తు అధికారులతో కొత్త పరివర్తకాన్ని ఏర్పాటు చేయించారు.

Published : 04 Jun 2023 05:18 IST

విద్యుత్తు ప్రమాదంలో కాలిపోయిన డయాలసిస్‌ పరికరాలను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ గత నెల 2న పరిశీలించారు. వెంటనే విద్యుత్తు అధికారులతో కొత్త పరివర్తకాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ఇంత వరకు కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు. దీంతో చేసేదేమి లేక జనరేటర్‌పై రోగులకు వైద్యచికిత్సలు అందించాల్సిన దుస్థితి. జనరేటర్‌ ఎప్పుడు ఆగిపోతుందో తెలియడం లేదని.. డయాలసిస్‌ కూడా సక్రమంగా చేయడం లేదని పలువురు రోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్తు కనెక్షన్‌ ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. అబ్దుల్‌ కలాం మాట్లాడుతూ.. కనెక్షన్‌ గురించి విద్యుత్తు శాఖ అధికారులను అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో జనరేటర్‌ సాయంతో రోగులకు డయాలసిస్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో కేంద్రంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని