బదిలీలు.. అష్టకష్టాలు
బదిలీ ప్రక్రియలో లోపాలు ఉపాధ్యాయులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఏ అంశంలోనూ స్పష్టత లేకపోవడంతో ఎవరిని అడగాలో.. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండి పోతున్నారు.
అవస్థలకు గురిచేస్తున్న ఐచ్ఛికం
మొరాయించిన ఆన్లైన్ సేవలు
లోపాలపై ఉపాధ్యాయుల ఆగ్రహం
ఒంగోలు నగరం, న్యూస్టుడే: బదిలీ ప్రక్రియలో లోపాలు ఉపాధ్యాయులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఏ అంశంలోనూ స్పష్టత లేకపోవడంతో ఎవరిని అడగాలో.. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండి పోతున్నారు. సోమవారం నుంచి ఆన్లైన్లో ఐచ్ఛికాలు(ఆప్షన్లు) పెట్టుకునేందుకు షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఇంతవరకు సంబంధిత సైట్ తెరుచుకోలేదు. సోమ, మంగళవారాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంది. ఉదయం పనిచేయాల్సిన వెబ్సైట్ సాయంత్రానికి కానీ తెరుచుకోలేదు. అదికూడా హెచ్ఎంలకు సంబంధించినది మాత్రమే. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన వెబ్సైట్ ఇంకా సిద్ధం కాలేదు. 5, 6 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు, 5, 6, 7 తేదీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆప్షన్లు పెట్టుకోవాలని షెడ్యూల్ ఇచ్చారు. అయితే తొలిరోజే నిరాశ ఎదురు కావడం గమనార్హం. హెచ్ఎంలు నెట్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. అధికారులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. హెచ్ఎంలకు రెండు రోజులే ఐచ్ఛికాలకు సమయం ఇవ్వడం.. అందులోనూ ఒకరోజు ఇప్పటికే గడిచి పోవడంతో ఖాళీలు చూసుకుని ఐచ్ఛికాలను ఎన్నుకునేందుకు సమయం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఉపాధ్యాయులు ఇంటర్నెట్ను ఆశ్రయిస్తే ఒత్తిడి పెరిగిపోయి వెబ్సైట్ పనిచేస్తుందా లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో దాదాపు 200 మంది హెచ్ఎంలు మంగళవారం రాత్రి 12లోపు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంది.
సమాచారం కోసం మల్లగుల్లాలు...
ఉమ్మడి ప్రకాశంలో 6,066 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎస్జీటీలు 3,347 మంది. సాధారణ విధానంలో కాకుండా వెబ్ కౌన్సెలింగ్ ప్రవేశపెట్టడంతో సమస్య తలెత్తింది. అందుకు అనుగుణంగా వెబ్సైట్ను ఆధునికీకరించక పోవడం ఉపాధ్యాయుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎస్జీటీల విషయానికొస్తే సీనియారిటీ ప్రకారం వారికి వచ్చిన పాయింట్లు ఆధారంగా వారికో సంఖ్య కేటాయిస్తారు. ఉదాహరణకు తన సంఖ్య వెయ్యి అయితే వెయ్యి ఖాళీలను వరుసగా ఆప్షన్ పెట్టుకోవాలి. ఇందుకు గంటల కొద్దీ సమయం పడుతుంది. ఆదీ వేగంగా చేస్తేనే సాధ్యం. కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువుగా ఉన్నవారికి ఇబ్బందులే. సేవ్ ఆప్షన్ లేకుండా విధానం ప్రవేశపెట్టడం వల్ల ఏదైనా తప్పు దొర్లితే మళ్లీ మొదటికి రావాల్సి వస్తుందంటున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, సాంకేతిక లోపాలు తలెత్తితే మరింత సమయం పడుతోంది. వేలాదిమంది ఇంత తక్కువ సమయంలో ఐచ్ఛికాలు పెట్టుకోవడం తలనొప్పిగా మారింది. ఒక మండలంలో పనిచేసే ఉపాధ్యాయుడుకి చట్టుపక్కల 30 నుంచి 40 పాఠశాలల గురించి మాత్రమే తెలుస్తుంది. వేలసంఖ్యలో ఆప్షన్లు పెట్టుకోవాలంటే ఆయా పాఠశాలల స్థితిగతులు గురించి తెలుసుకోవాలి. ఈ సమాచారం సేకరణతో మల్లగుల్లాలు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని