542 పోస్టులు బ్లాక్
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో సమస్యలు కొలిక్కి రాలేదు. మరోవైపు పెద్ద సంఖ్యలో పోస్టులు బ్లాక్ చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమీప ఖాళీలు కనిపించక ఉపాధ్యాయుల ఆవేదన
ఐచ్ఛికాల నమోదుకూ తప్పని అవస్థలు
జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో సమస్యలు కొలిక్కి రాలేదు. మరోవైపు పెద్ద సంఖ్యలో పోస్టులు బ్లాక్ చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుదారులు ఐఛ్చికాలు పెట్టుకునేందుకు ఈ నెల 8 వరకు షెడ్యూలు ఇచ్చారు. ఒక రోజు ఆలస్యంగా సైట్ ఓపెన్ కావడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా ఎస్జీటీలు పెద్ద సంఖ్యలో ఆప్షన్లు పెట్టుకోవాల్సి రావడంతో... నెట్ సెంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎస్జీటీ పోస్టులు పెద్ద సంఖ్యలో బ్లాక్ చేయడమూ వారిని నిరాశకు గురిచేసింది. ప్రాధాన్యతా విభాగంలో ఉన్నవారికి సైతం సమీపంలో పోస్టులు కనిపించక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మండలంలో అయిదు నుంచి ఏడు పోస్టుల వరకు బ్లాక్ చేశారు. ఉమ్మడి ప్రకాశంలో 6,066 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 3,400 మంది ఉన్నారు. ఆ కేటగిరీ పోస్టులు 482 బ్లాక్ చేయగా, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 60 బ్లాక్ చేశారు. ఇన్ని పోస్టులు బ్లాక్ చేయడాన్ని పీడీలు సైతం ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగోన్నతులు సరే ఉత్తర్వులేవీ...
జిల్లాలో అర్హులైన సుమారు 600 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. ఇప్పటికి నాలుగు రోజులైనా వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు. ఎస్జీటీలు స్కూలు అసిస్టెంట్లుగా, స్కూలు అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందారు. వారు కూడా పెరిగిన హోదా విభాగంలోనే బదిలీకి దరఖాస్తు చేయాలి. కనీసం పదోన్నతి పొందిన పత్రం చేతికివ్వకుండా బదిలీ దరఖాస్తు ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా ఇక్కడ ఇంకా కొలిక్కి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!