ఎన్నాళ్లకెన్నాళ్లకు...!
ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించింది. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు 65 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉత్తర్వులిచ్చింది.
వైద్య కళాశాలకు 65 పీజీ సీట్ల మంజూరు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఏళ్ల నాటి నిరీక్షణ ఫలించింది. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు 65 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉత్తర్వులిచ్చింది. గతంలో 19 సీట్లు ఇచ్చినప్పటికీ అవన్నీ నాన్ క్లినికల్ విభాగానివి కావడంతో రోగులకు అంతగా ప్రయోజనం చేకూరలేదు. తాజాగా మంజూరైనవి క్లినికల్ విభాగానికి సంబంధించినవి కావడంతో ఇటు వైద్య విద్యార్థులకు అటు ఆసుపత్రికి వచ్చే రోగులకు మేలు కలగనుంది.
పుష్కరానికి నెరవేరిన కల...
ఒంగోలులో 2011లో వైద్య కళాశాల ప్రారంభమైంది. ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు, అవసరమైన వసతులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇప్పటివరకు ప్రాధాన్యం కలిగిన సీట్లు మంజూరు కాలేదు. అయిదు పర్యాయాలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలన చేసినా సిబ్బంది కొరత వల్ల అనుమతులు రాలేదు. ఆరు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగోన్నతులు కల్పించడంతో ఇక్కడ ఖాళీగా ఉన్న బోధకుల పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ విధంగా దాదాపు పన్నెండేళ్ల తరువాత ప్రాధాన్యం కలిగిన పీజీ సీట్లకు అనుమతి లభించింది. పీజీ విద్యార్థులు అందుబాటులో ఉంటే ఓపీ విభాగంలో నిరాటంకంగా సేవలందించేందుకు వీలు కలుగుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఆగస్టులో ప్రవేశాలు...
పీజీ సీట్లకు ఆగస్టులో ప్రవేశాలు జరగనున్నాయి. సంబంధిత పీజీ నీట్ పరీక్ష మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. ఇక్కడ చేరే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపల్ సాల్మన్ రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే వసతి గృహాల నిర్మాణం జరుగుతోంది. ఆగస్టు నాటికి ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది. వాటిని నూతనంగా చేరే విద్యార్థులకు కేటాయించనున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు