కల్యాణానికి వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు
శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా మినీ లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. వేగంగా వచ్చి ఢీకొట్టిన దుర్ఘటనలో తల్లీ కుమారుడు, ఓ బాలుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన మినీ లారీ
తల్లి, కుమారుడు, మేనల్లుడి మృత్యువాత
విగతజీవిగా ప్రవీణ్ కుమార్
దిలీప్ కుమార్ (పాత చిత్రం)
టంగుటూరు, న్యూస్టుడే: శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా మినీ లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. వేగంగా వచ్చి ఢీకొట్టిన దుర్ఘటనలో తల్లీ కుమారుడు, ఓ బాలుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. ఈ హృదయ విదారక ఘటన టంగుటూరు మండలం ఎం.నిడమానూరు - మర్లపాడు గ్రామాల మధ్య గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన బందెల కోటిరత్నం(35), సురేష్ దంపతులు. వీరు బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు ప్రవీణ్ కుమార్(10) ఉన్నారు. బంధువుల వివాహానికి కుమారుడు ప్రవీణ్తో కలిసి కోటిరత్నం నిడమానూరు వచ్చారు. సాయంత్రం తిరిగి ఈతముక్కల వెళ్లేందుకు బయలుదేరారు. అదే సమయంలో ఆమె మేనల్లుడైన ఎం.నిడమానూరుకు చెందిన మేలం దిలీప్ కుమార్(19) అక్కడికి వచ్చాడు. వారిద్దరినీ బస్సు ఎక్కించేందుకు తన ద్విచక్ర వాహనంపై ఉప్పలపాడు తీసుకెళ్లాడు. బస్సు రావడం ఆలస్యం కావడంతో పెట్రోల్ పోయించుకునేందుగాను సమీపంలోని బంకు వద్దకు ముగ్గురూ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో నిడమానూరు శివారులోని బంకు వద్దకు వెళ్లి పోయించుకున్నారు. తిరిగి ముగ్గురూ ద్విచక్ర వాహనంపై మర్లపాడు వైపు వెళ్తుండగా.. అటు నుంచి వస్తున్న మినీ వ్యాన్ ఢీకొట్టింది. మినీ వ్యాన్ వేగం ధాటికి ముగ్గురితో పాటు ద్విచక్ర వాహనం ఎదుటి భాగంలో ఇరుక్కుపోయింది. పది అడుగుల దూరం ముందుకు వెళ్లిన తర్వాత మినీ వ్యాన్ అదుపుతప్పి రహదారి పక్కనున్న కాలువలో పల్టీలు కొడుతూ పడిపోయింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వ్యాన్ చోదకుడు పరారయ్యాడు.
* తెలియని దారిలో వచ్చి..: వాస్తవానికి మినీ వ్యాన్ ముప్పవరం నుంచి ఒంగోలు వెళ్లాల్సి ఉంది. టంగుటూరు వైపు నుంచి దూరం కావడంతో నిడమానూరు మీదుగా వెళ్తున్నాడు. మినీ వ్యాన్ చోదకుడు కర్ణాటక వాసి కావడం.. మర్లపాడు వద్ద రోడ్డును స్థానికులు మూసి వేయడంతో దారి తెలియక తిరిగి వ్యతిరేక మార్గంలో వెనక్కి వస్తున్నాడు. అదే సమయంలో పెట్రోల్ కోసమని వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ముగ్గురి మృతికి కారణమయ్యాడు.
* కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు...: కోటిరత్నం ఎం.నిడమానూరు ఎంపీటీసీ సభ్యురాలు చిన్నమ్మాయి కుమార్తె. ప్రమాదంలో కుమార్తె, మనవడు ప్రాణాలు కోల్పోవడంతో ఆమెతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనం వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. మేలం గురుమూర్తి ఆటో డ్రైవర్గా జీనం సాగిస్తున్నారు. ఇతని కుమారుడు దిలీప్ కుమార్. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి డిగ్రీలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని రోదించడాన్ని చూసిన పలువురు కంట నీరు పెట్టుకున్నారు.
బోల్తా పడిన మినీ వ్యాన్ వద్ద గుమిగూడిన స్థానికులు
సంఘటనా స్థలంలో రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
యాక్టర్ జగన్
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.