పక్షవాతం వచ్చిందని... వదిలేశారు
పక్షవాతం వచ్చిన ఓ వ్యక్తిని బంధువులు, కుటుంబసభ్యులు పోషించలేమంటూ రోడ్డుపై అనాథగా వదిలేయడంతో రోజంతా రోడ్డుపైన ఉండిపోయిన సంఘటన రాచర్ల మండలంలో గురువారం చోటుచేసుకుంది.
రోజంతా రోడ్డుపైనే...
రోడ్డుపై అనాథగా మిగిలిన పెద్దిరాజు
రాచర్ల, న్యూస్టుడే : పక్షవాతం వచ్చిన ఓ వ్యక్తిని బంధువులు, కుటుంబసభ్యులు పోషించలేమంటూ రోడ్డుపై అనాథగా వదిలేయడంతో రోజంతా రోడ్డుపైన ఉండిపోయిన సంఘటన రాచర్ల మండలంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు... రాచర్ల గ్రామానికి చెందిన గుర్రపుశాల పెద్దిరాజుకు ఆదే గ్రామానికి చెందిన బంధువు అమ్మాయి లక్ష్మీతో 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆయన హైదరాబాద్లో పెట్టుడు దంతాల సెట్లు తయారు చేసి విక్రయించి జీవనం సాగించేవారు. పెద్దిరాజుకు రెండు సంవత్సరాల క్రితం పక్ష వాతం వచ్చి కాలు, చెయ్యి పడిపోయాయి. దీంతో కొన్ని రోజుల పాటు భార్య పోషించింది. అనంతరం గ్రామానికి తీసుకొచ్చి ఆయన తల్లిదండ్రుల వద్ద వదిలి హైదరాబాద్ వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లి పోషిస్తుండేది. మూడు నెలల క్రితం ఆమె బంధువుల ఊరికి వెళుతూ చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అప్పటి నుంచి పెద్దిరాజును, ఆయన తండ్రిని సోదరుడే పోషిస్తున్నాడు. ఇటీవల సోదరుడు, గ్రామస్థులు పెద్దిరాజును తీసుకొని హైదరాబాద్ వెళ్లి పెద్ద మనుషుల సమక్షంలో భార్యతో మాట్లాడారు. తానే పోషించుకుంటానని త్వరలో పెద్దమనుషులతో గ్రామానికి వస్తానని తెలపడంతో గ్రామస్థులు ఆయనను తీసుకొని గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే పెద్దిరాజు భార్య రెండు రోజుల క్రితం ఒక్కరే వచ్చారు. దీంతో ఆమెకు పెద్దిరాజును అప్పగించి సోదరుడు, తండ్రితో పాటు కుటుంబసభ్యులతో గిద్దలూరు వెళ్లిపోయారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తనకు ఇవ్వాల్సిన వాటా కోరారు. బుధవారం రాత్రి తాను భర్తను పోషించలేనని తెలపడంతో ఆయనను చూసే వారు లేక రోడ్డున పడ్డారు. గురువారం ఉదయం నుంచి అత్త వారి ఇంటి వద్దే అలాగే ఉండిపోయారు. తాను దిక్కులేని వాడయ్యానని, తనను భార్య పోషించేలా చూడాలని రోదిస్తూ గ్రామస్థులను వేడుకున్నారు. చివరకు గురువారం రాత్రి భర్తను తానే చూసుకుంటానని చెప్పి అతడిని ఇంట్లోకి భార్య తీసుకుపోవడంతో సమస్య తీరిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?