పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
భార్యతో గొడవపడి ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఓ వ్యక్తి ఇంట్లోంచి వచ్చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
చిన్నారులతో పాటు తండ్రిని కాపాడిన పోలీసు సిబ్బంది
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే : భార్యతో గొడవపడి ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఓ వ్యక్తి ఇంట్లోంచి వచ్చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం గిద్దలూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన గురుమోహన్ బుధవారం సాయంత్రం భార్యతో గొడవపడ్డారు. ఆగ్రహంతో తన ఇద్దరు పసి పిల్లలను తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన గురుమోహన్ తల్లి కడప జిల్లా కలసపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడి ఎస్.ఐ నాగమురళి సైబర్ క్రైం పోలీసుల సహకారంతో గురుమోహన్ గిద్దలూరులో ఉన్నట్లు గుర్తించి అక్కడి సిబ్బందికి తెలిపారు. దీంతో గురువారం గిద్దలూరు పోలీసులు రంగంలోకి దిగి గాంధీబొమ్మ కూడలిలో ఇద్దరు కుమార్తెలతో ఉన్న గురుమోహన్ను గుర్తించారు. కలసపాడు ఎస్.ఐ నాగమురళి వారిని అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మనో వేదనతో..
తాళ్లూరు (ముండ్లమూరు) : మనోవేదనకు గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన తాళ్లూరు ఎస్సీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి మరియబాబు(20) వృత్తి విద్య కోర్సు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో కలత చెంది బుధవారం విష రసాయనం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఒంగోలు రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు, తండ్రి శ్యాంసన్ ఫిర్యాదుతో తాళ్లూరు ఎస్సై ప్రేమ్కుమార్ గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రేమ విఫలం కావడంతోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు