విద్యుత్తు శాఖ అధికారుల ఆకస్మిక దాడులు
ఒంగోలు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
ఆకస్మిక తనిఖీల్లో పాల్గొన్న విజిలెన్స్ ఉన్నతాధికారులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 34 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్తు వినియోగిస్తున్న వారిపై జరిమానాలు విధించారు. మాల్ ప్రాక్టీస్, అదనపు లోడుకు సంబంధించి మొత్తం 2,923 సర్వీసులు తనిఖీ చేయగా, అందులో 236 మందికి రూ.6.19 లక్షల అపరాధ రుసుం విధించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్ఈ ఎం.అల్ఫాన్స్, ఈఈ టి.శ్రీనివాసరావు, ఈఈ వి.శ్రీనివాసులు, డీఈ మోహనరావు, ఏఈ చెన్నారెడ్డితోపాటు, ఒంగోలు డివిజన్ పరిధిలోని విద్యుత్తు శాఖ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
27 కేసులు.. రూ.2,28,700 జరిమానా..
త్రిపురాంతకం, న్యూస్టుడే : త్రిపురాంతకం మండలంలోని అక్రమంగా విద్యుత్తు వాడుకుంటున్న వినియోగదారులపై విద్యుత్తు శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఒంగోలు డీపీఈ డీఈ హైమావతి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమంగా విద్యుత్తు వాడుకుంటున్న వారిపై 77 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రూ.2,28,700 లు వారిపై అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు. ఎవరైనా అక్రమంగా విద్యుత్తు దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో డీపీఈ ఏడీఈ శ్రీనివాసరావు, డీపీఈ ఏఈ కోటేశ్వరరావు, మార్కాపురం విద్యుత్తు ఆపరేషన్ సబ్-డివిజన్లోని పలు అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..