బలరాం ఇంట్లో బాలినేని
జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి ప్రకాశంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి.
అక్కడ పవన్తో స్వాములు భేటీ
బాలినేని, కరణంతో నాయకులు, కార్యకర్తలు
ఇక్కడ మంతనాలుఒంగోలు నేర విభాగం, న్యూస్టుడే: జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి ప్రకాశంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల వరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో రెండోసారి భేటీ అయిన అనంతరం కూడా ఆయన మౌనముద్ర పాటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సాగిన ఒక భేటీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి చెందిన ఒంగోలు నివాసానికి బాలినేని శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైకాపా పర్చూరు నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఇటీవల కలిశారు. చీరాల, దర్శి నేతలతో కలిసి భారీ ప్రదర్శనగా వెళ్లి పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ నెల 12న ఆయన జనసేనలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నివాసంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తన సోదరుడు కృష్ణమోహన్ వైకాపా పర్చూరు నియోజకవర్గ బాధ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే స్వాములు పవన్ కల్యాణ్ను కలవడం రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. బాలినేని, కరణం భేటీలో ప్రధానంగా ఈ అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM