సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష
నవరత్నాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు సూచించారు.
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, చిత్రంలో నారాయణమూర్తి, కలెక్టర్ దినేష్కుమార్, ఏఎస్పీ నాగేశ్వరరావు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: నవరత్నాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఎనిమిది ప్రాధాన్యతా సూచీల పురోగతిపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఒంగోలు ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో విష్ణు పాల్గొని మాట్లాడారు. నవరత్నాల పథకాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా జిల్లాతో పాటు, రాష్ట్ర స్థానం కూడా మెరుగవుతుందన్నారు. బైజూస్ పాఠాలు, నాడు-నేడు, అమ్మఒడి, విద్యాకానుక, సంపూర్ణ పోషణ అమలుతో పాటు; పాఠశాలల్లో డ్రాప్ అవుట్లు, బాల్య వివాహాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. గతంలో 65.3 శాతం మంది చిన్నారులు, బాలింతల్లో రక్తహీనత ఉండేదని, ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 53.7 శాతానికి తగ్గినట్టు తెలిపారు. ఏడాదిలోపు వయసున్న పిల్లల్లో మరణాల రేటు గతంలో వెయ్యికి 60 మంది ఉంటే, నేడు 25కు తగ్గిందని వివరించారు. నవరత్నాల కార్యక్రమాల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఎ.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టితో పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ.. పదో తరగతి ఉత్తీర్ణురాలైన ప్రతి విద్యార్థిని ఆపై తరగతుల్లో చేరేలా బాలికా వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, సీపీవో వెంకటేశ్వర్లుతో పాటు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ