అద్దె భవనాల అన్వేషణలోనే ఆంధ్రకేసరి
ప్రభుత్వం నుంచి నిర్వహణ ఖర్చులకు అవసరమైన రూ. 2.50 కోట్లు మాత్రమే అందాయి. పూర్తిస్థాయివి ఎప్పటికి విడుదలవుతాయో తెలియదు.
ప్రభుత్వం నుంచి అరకొరగానే నిధులు
అయినప్పటికీ ప్రారంభం దిశగా తరగతులు!
పేర్నమిట్ట కొండపై నిర్మించిన తరగతి గదులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ప్రభుత్వం నుంచి నిర్వహణ ఖర్చులకు అవసరమైన రూ. 2.50 కోట్లు మాత్రమే అందాయి. పూర్తిస్థాయివి ఎప్పటికి విడుదలవుతాయో తెలియదు. మరికొద్ది రోజుల్లో వస్తాయని ఆశిస్తున్నా.. అందుకు సంబంధించి సంకేతాల జాడలేదు. విద్యార్థులకు వసతి కల్పించేందుకు, కొన్ని కోర్సుల నిర్వహణకు భవనాల కొరత ఉంది. వీటి కోసం అద్దె భవనాలు తీసుకోడానికి చేపట్టిన అన్వేషణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో జులై నుంచి డిగ్రీ కోర్సులు, ఆగస్టు నుంచి పీజీ కోర్సుల తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ఉప కులపతి, ఇతర బాధ్యతాయుత పోస్టుల్లో ఉన్న అధికారులు పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇం‘ధనం’ చేతికందలేదు. ఇదీ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం దుస్థితి.
* 93 కళాశాలలు.. 25 వేల మంది విద్యార్థులు...: పేర్నమిట్ట కొండ మీద గతంలో నిర్మించిన భవనంలో సైన్స్ కోర్సులు ప్రారంభించే యోచనలో ఉన్నారు. అన్ని తరగతులు నిర్వహించడానికి, యువతీ యువకులకు విడివిడిగా వసతి కల్పించేందుకు ప్రైవేట్ భవనాలు అవసరం. వీటి కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల, మంగమ్మ కళాశాల భవనాలు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం 35 మంది బోధన, 20 మంది బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉండగా.. కొత్త కోర్సులకు త్వరలో కాంట్రాక్టు పద్ధతిన బోధకుల నియామకం చేపడతారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి ప్రకాశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. ఇటీవల వాటిని అధికారికంగా ఏకేయూ పరిధిలోకి చేర్చారు. దీంతో 93 డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాయలయం గొడుగు కిందికి చేరినట్లైంది. ప్రస్తుతం వాటికి గుర్తింపు(అఫ్లియేషన్) ఇచ్చే ప్రక్రియ సాగుతోంది. వాటిలో పది ప్రభుత్వ, మూడు ఎయిడెడ్ కళాశాలలుండగా మిగిలినవన్నీ ప్రైవేట్వి. మొత్తం మీద మొదటి సంవత్సరం డిగ్రీలో చేరే విద్యార్థులు 25 వేల మంది ఉంటారని అంచనా.
* మారిన విధానంపై అవగాహన...: ఈ నెల 21 నుంచి డిగ్రీ ప్రవేశాలు ఆన్లైన్ ద్వారా ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకుంటే ఉన్నత విద్యాశాఖ సీట్లు కేటాయిస్తుంది. అనంతరం నిర్ణీత రుసుములు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈసారి డిగ్రీ కోర్సుల్లో మార్పు చేశారు. మూడేళ్లను నాలుగు సంవత్సరాలకు పెంచారు. మూడేళ్లు మాత్రమే చదవడానికి ఇష్టపడే వారికి కోర్సు అయ్యాక పాత పద్ధతిలో పట్టా అందిస్తారు. నాలుగేళ్లు చదివే వారికి డిగ్రీ ఆనర్స్ పట్టా ఇస్తారు. కోర్సుల ఎంపికలో కూడా మార్పులు చేశారు. ప్రతి విద్యార్థి రెండో సెమిస్టర్ నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్టు తీసుకోవాల్సి ఉంటుంది. మారిన విధానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలని విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయించారు.
ఆరు కొత్త కోర్సులకు ఆమోదం...
ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో కొత్తగా ఆరు సైన్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఎన్యూ పరిధిలో పీజీ కేంద్రం ఉన్నప్పుడు తొమ్మిది కొనసాగాయి. వీటికి అదనంగా ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలైటికల్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్ కోర్సుల్లో ఎంఏ ఆంగ్లం, ఎంఏ తెలుగు కోర్సులు ప్రారంభించనున్నారు. ఇటీవలే కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తంమీద విశ్వవిద్యాలయంలో పాత కోర్సుల్లో 500 సీట్లు, కొత్త వాటిల్లో 250 అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం కామన్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఆదివారంతో ఇవి పూర్తవుతాయి. ఫలితాలు ప్రకటించాక ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించాలి. ఏకేయూలో ప్రస్తుతం పాత భవనాలు అందుబాటులో ఉన్నాయి.
ఉపాధికి దోహదపడేలా కృషి...
జిల్లాలోని వనరులు, పరిశ్రమలను బట్టి కోర్సులు ఎంపిక చేశాం. వీటి వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆగస్టు నాటికి అన్ని సౌకర్యాలతో తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, డీన్, ఏకేయూ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత