సకల జనం.. సంఘీభావం
వైకాపా ప్రభుత్వ అరాచక విధానాలపై సకల జనులు భగ్గుమంటున్నారు.
అక్రమాన్ని ఏకేస్తా: దూదిని ఏకే కమాన్తో నూర్ బాషా సంఘం నేత బారాఇమామ్
కక్షపై ప్రేమ గెలవాలని...: ఒంగోలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న పాస్టర్లు
ఈనాడు, ఒంగోలు: వైకాపా ప్రభుత్వ అరాచక విధానాలపై సకల జనులు భగ్గుమంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలకు తరలివచ్చి తమ అసంతృప్త గళాలను వినిపిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, జైలు నుంచి త్వరగా బయటికి రావాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు, ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో తెదేపా ఎస్సీ, ఎస్టీ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న మార్కాపురంలోని దీక్షా శిబిరంలో కొనకనమిట్ల మండలానికి చెందిన తెలుగు తమ్ముళ్లు కూర్చున్నారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఆధ్వర్యంలో, యర్రగొండపాలెంలో నియోజకవర్గ బాధ్యుడు గుడూరి ఎరిక్షన్బాబు నేతృత్వంలో దీక్షలు కొనసాగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగం నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కనిగిరిలో కుల వృత్తులను ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబుకు అండగా నిలుస్తామంటూ ప్రతినబూనారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు కరపత్రాలను పంచి పెట్టారు. చీమకుర్తి శిబిరంలో సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు., కొండపి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తమ దీక్ష కొనసాగించారు.
మద్దిపాడు మండలం గుండ్లాపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన
బాబు రావాలి.. ‘గీత’ మారాలి...: కనిగిరిలో బ్యానర్పై సంతకం చేస్తున్న కల్లుగీత కార్మికుడు రంగయ్య
గంప, చాటలతో కనిగిరి దీక్షా శిబిరంలో మేదర సంఘం నాయకుడు నరసింహస్వామి
నిజాలు చూడలేని ప్రభుత్వం...: కళ్లకు గంతలు కట్టుకుని ఒంగోలులో
తెదేపా ఎస్సీ, ఎస్టీ విభాగం నాయకుల నిరసన
ముండ్లమూరు: చంద్రబాబు విడుదల కోరుతూ పోలవరంలో
వినాయక విగ్రహం వద్ద పూజల్లో పాల్గొన్న మహిళలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కష్టాలు @ 2.0
[ 29-11-2023]
స్థిరాస్తుల క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీల రిజిస్ట్రేషన్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన విధానంలోని వన్టైం పాస్ వర్డ్(ఓటీపీ) నిబంధన ఆందోళనకు గురిచేస్తోంది. స్టాంపులు, కంప్యూటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని 1999లో తీసుకొచ్చారు -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
[ 29-11-2023]
‘ఎన్నికల విధులకు సంబంధించి ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా తాఖీదులు కాదు.. కఠిన చర్యలే ఉంటాయి’ అని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. -
మీరిచ్చిందే చూస్తాం..నిజాలకు పాతరేస్తాం
[ 29-11-2023]
వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టుల పోస్టులు భర్తీ చేశారు. అనంతరం జాతీయ వైద్య మిషన్ కింద స్టాఫ్నర్సుల నియామకాలు చేపట్టారు. -
అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతపై అప్పుల భారం
[ 29-11-2023]
రుల నిర్లక్ష్యం వందల మంది రైతులకు శాపంగా మారింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం తీసుకున్న రుణం పెనుభారంగా పరిణమించింది. తాము చేయని తప్పునకు రెక్కల కష్టాన్ని కోల్పోవాల్సిన దుస్థితి తలెత్తిం -
విధుల్లోకి తీసుకోకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా
[ 29-11-2023]
అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేదు. చికిత్స అనంతరం తిరిగి చేరేందుకుగాను వైద్య పరీక్షల నివేదికలు అందించినా అధికారులు స్పందించడం లేదు -
రబీలోనూ ఖాళీ
[ 29-11-2023]
జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతోంది. అయినప్పటికీ పొలాల్లో హలాల సవ్వడి అంతగా కనిపించడం లేదు. చూసేందుకు పంటలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. అదునులో పదునైన వానే లేకపోవడంతో రైతులు ఈసురోమంటున్నారు -
కేరళ వాయిద్యం.. గ్రామోత్సవ సంరంభం
[ 29-11-2023]
పామూరులో వాసవీ మాత గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి ప్రధాన వీధుల్లో ఊరేగించారు -
నిధుల్లేవంటే జనానికి ఏం చెప్పాలి!
[ 29-11-2023]
ఏ సమస్య చెప్పినా నిధుల్లేవని చెబుతున్నారని, ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని అధికార పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
మీటర్ల అవకతవకల బాధ్యులకు నోటీసులు
[ 29-11-2023]
వై.పాలెం విద్యుత్తు సబ్-డివిజన్ పరిధిలోని విద్యుత్తు వినియోగ మీటర్ల రీడింగ్ నమోదులో అవకతవకలకు కారకులైన బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా విద్యుత్తుశాఖ ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ అన్నారు -
జ్యోతిర్లింగాల దర్శనానికి సైకిల్ యాత్ర
[ 29-11-2023]
దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఓ యువకుడు భారత సైకిల్ యాత్ర చేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన ఘనశ్యామ్ 45 రోజుల క్రితం యాత్రకు శ్రీకారం చుట్టాడు -
శిలా ఫలకం ధ్వంసం
[ 29-11-2023]
మండలంలోని నాగంబొట్లపాలెంలో మంగళవారం శిలాఫలకం ధ్వంసాన్ని తెదేపా నాయకులు అడ్డుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆ గ్రామ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాన్ని సంబంధించిన శిలాఫలకాన్ని అప్పటి రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ఆవిష్కరించారు -
ఏడో కాన్పునకెళ్లి.. ప్రాణాలు కోల్పోయి..
[ 29-11-2023]
ఏడో కాన్పు కోసం వెళ్లిన గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్