వధ్య శిలపై వంచితులు
విద్యుత్తు శాఖలో కొందరు అధికారుల ఉదాసీనతకు పేద కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి.
స్తంభాలపై తెల్లారుతున్న బతుకులు
మామూళ్ల మాయతో అందని సాయం
రోడ్డున పడుతున్న ప్రైవేటు కార్మికులు
మార్కాపురం అర్బన్ న్యూస్టుడే: విద్యుత్తు శాఖలో కొందరు అధికారుల ఉదాసీనతకు పేద కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. విద్యుత్తు స్తంభాలెక్కి బుగ్గయిన ప్రైవేటు షిఫ్ట్ ఆపరేటర్లు, కార్మికుల వేదన ఎవరికీ పట్టడంలేదు. వారిని ఇష్టారాజ్యంగా నియమించుకోవడమే తప్ప.. ప్రాణాపాయం సంభవించినప్పుడు చిల్విగవ్వ కూడా చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా అధికారం అడ్డు చక్రమేస్తోందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో ఇటీవలకాలంలో పలువురు ప్రైవేటు విద్యుత్తు కార్మికులు మరమ్మతులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమతమై సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
గాల్లో కలిసిన ప్రాణాలెన్నో..
చికిత్స పొందుతున్న కాకర్ల చిన్న
జిల్లాలో ఈ ఒక్క ఏడాదిలోనే నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు ప్రైవేటు విద్యుత్తు ఆపరేటర్లు పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
- ఈ ఏడాది ఏప్రిల్ 28న మార్కాపురం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవనగర్లో ఓ బహుళ అంతస్థుల భవనంలో విద్యుత్తు పనులు చేస్తూ పెద్దారవీడు మండలం సుంకేసులకు చెందిన ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందారు.
- ఫిబ్రవరి 4న ముండ్లమూరులో విద్యుత్తు లైన్లు మార్చే క్రమంలో చీదర వెంకటేశ్వర్లు అనే ప్రైవేటు ఆపరేటర్ చనిపోయారు.
- మే 4న ఉలవపాడు మండలం మన్నేటికోటలో 11 కేవీ లైన్ మరమ్మతులు చేస్తూ కార్మికుడు మృత్యువాత పడ్డారు.
- ఆగస్టు 16న త్రిపురాంతకం మండలం దివిపల్లిలోని పొలాల్లో మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్తు సరఫరా కావడంతో ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయారు.
ఆదుకునేవారేరీ.. ?
పోసుపల్లిలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న శేఖర్(పాత చిత్రం)
పశ్చిమ ప్రకాశంలో విద్యుత్తు అధికారుల తీరుతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రైవేటు విద్యుత్తు కార్మికులు వాపోతున్నారు. ఆగస్టు 13న కొమరోలు మండలం పోసుపల్లిలో విద్యుత్తు పనులు చేస్తూ శేఖర్ అనే కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగి నెల గడుస్తున్నా బాధ్యులైన వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందించాల్సిన క్షేత్రస్థాయి అధికారిలో స్పందన కరువైంది.
కీలక నాయకుడని మిన్నకుండిపోయారా...
మార్కాపురం పట్టణంలోని పలకల పరిశ్రమ సమీపంలోని ఓ మిల్లులో ఆగస్టు 28న విద్యుత్తు సమస్య తలెత్తడంతో లైన్మెన్ స్థానంలో ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ను అక్కడికి పంపించారు. అక్కడ పనులు చేస్తూ అతను విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనుంచి పడిపోయారు. ప్రమాదానికి కారణమైన ఉద్యోగి అధికార పార్టీకి చెందిన కీలక యూనియన్ నాయకుడు కావడంతో స్థానిక క్షేత్రస్థాయి అధికారి ఆయనపై నివేదిక సమర్పించడంలో జాప్యం చేస్తున్నారు. మరోవైపు బాధితుడి చికిత్స ఖర్చులన్నీ మిల్లు యజమాని భరించే విధంగా సదరు ఉద్యోగి ఒప్పందం కుదుర్చుకోవడం ఆయన అధికార దర్పానికి మచ్చుతునక. లైన్మెన్ల నిర్లిప్తత, షిప్ట్ ఆపరేటర్ల బాధ్యతారాహిత్యం కారణంగా పలువురు ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. కీలక అధికారుల ఆశీస్సులు.. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో కొందరు విద్యుత్తు లైన్మెన్లపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ప్రైవేటు కార్మికుల సేవలు వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల్లో గొప్పలు.. చేతల్లో అభాసు‘పాలు’
[ 30-11-2023]
వైకాపా ప్రభుత్వం 2020 నవంబర్లో జగనన్న పాల వెల్లువ పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా సంఘాల్లో పాలు పోసే మహిళా రైతులకు పాడి గేదెల కొనుగోలుకు ప్రభుత్వరంగ బ్యాంక్తో పాటు, పీడీసీసీ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించారు. -
అప్పుడు ఆరుష్.. ఇప్పుడు నిరీక్ష
[ 30-11-2023]
సాయంత్రం సమయంలో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు, గ్రామస్థులతో కలిసి ఆ రాత్రంతా గ్రామంలో వెతికారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఊరికి చేరుకున్నారు. -
మీరే భూచోళ్లు.. ఉన్నాయి ఆధారాలు
[ 30-11-2023]
‘అధికార పార్టీకి చెందిన మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి చేసిన భూ దందాలు, అవినీతి అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి. కొన్ని ఆడియో టేపులు కూడా భద్రపరిచాను. -
వాళ్లు కట్టారు.. వీళ్లు కక్షగట్టారు
[ 30-11-2023]
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన వైకాపా హామీలు గుప్పించింది. ఆచరణలో మాత్రం తగినన్ని నిధులు కేటాయించక తరచూ వాయిదాలతోనే సరిపెడుతూ వస్తోంది. ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవడం సంగతి అటుంచితే.. -
ఓటర్ల చేర్పులకు ప్రత్యేక శిబిరాలు
[ 30-11-2023]
అర్హులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు డిసెంబర్ 2, 3 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు, జిల్లాలోని ఈఆర్వోలతో ఒంగోలు ప్రకాశం భవన్లోని ఛాంబర్లో బుధవారం సమావేశం నిర్వహించారు. -
విభిన్నం.. ప్రతిభ అపారం
[ 30-11-2023]
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని డీఆర్వో ఆర్.శ్రీలత సూచించారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు సంతపేటలోని డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. -
ఆరొందల ఏళ్లనాటి తెలుగు శాసనం లభ్యం
[ 30-11-2023]
యర్రగొండపాలెం మండలం నల్లమల అడవిలోని పొన్నలబయలు చెంచు గూడెంలో 600 ఏళ్లనాటి తెలుగు శిలా శాసనం వెలుగు చూసింది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి దేవరాయలు శకవత్సరం 1325 (క్రీ.శ 1404) ఏప్రిల్ నెల 14వ తేదీన ఈ శాసనం వేయించినట్లు దక్షిణ భారత పురావస్తుశాస్త్ర డైరెక్టర్ కె.మునిరత్నం నిర్ధారించినట్లు వై.పాలెంలోని చరిత్ర పరిశోధకులు, -
ఇటు క్రీడ.. అటు మేథ
[ 30-11-2023]
ఇటు క్రీడలు.. అటు చదువుల్లోనూ ఆ మెరికలు సత్తా చాటుతున్నారు. సాఫ్ట్, నెట్, బేస్బాల్ పోటీల్లోనే కాక.. మేథకు అద్దం పట్టే యువికా, సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనల్లో రాణిస్తున్నారు మంగమూరి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. ఇప్పటి వరకూ దాదాపు వందకు పైగా విద్యార్థులు ఇరు విభాగాల్లో రాణించి రాష్ట్రస్థాయిలో పాల్గొని రికార్డు సృష్టించారు. -
అనారోగ్యంతో ముగ్గురి బలవన్మరణం
[ 30-11-2023]
అనారోగ్య సమస్యలతో వేర్వేరుచోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం...మార్కాపురం భగత్సింగ్ కాలనీలో నివాసముంటున్న తాడిశెట్టి కేశవ(48) ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోని క్షయ విభాగంలో ఒప్పంద ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా