గోవా నుంచి తెచ్చి.. స్థానిక లేబుళ్లు ముద్రించి..
గోవా నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలించి దందా నడుపుతున్న వారి ఆట కట్టించారు జిల్లా పోలీసులు.
అక్రమ మద్యం రాకెట్ గుట్టు రట్టు
అయిదుగురు నిందితుల అరెస్టు
నిందితులతో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సుధీర్బాబు, సెబ్ ఇన్స్పెక్టర్ లత
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: గోవా నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలించి దందా నడుపుతున్న వారి ఆట కట్టించారు జిల్లా పోలీసులు. గత కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దోపిడీకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) చెక్ పెట్టింది. అయిదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 416 గోవా మద్యం సీసాలు, 282 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని సెబ్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎం.సుధీర్బాబు వివరాలు వెల్లడించారు. కొత్తపట్నం మండలం చిన్నంగారిపట్టపుపాలేనికి చెందిన మేకల బాబు, ఊళ్లపాలెం గ్రామానికి చెందిన అరవ పవన్ తమకు పరిచయం ఉన్న వ్యక్తులతో గోవా నుంచి తక్కువ ధరకు మద్యం రప్పించి స్థానికంగా బెల్టు దుకాణాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో సెబ్ ఇన్స్పెక్టర్ బి.లత, ఎస్సై గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం గత కొన్నిరోజులుగా నిఘాపెట్టారు. వారి కదలికలపై కన్నేసి గురువారం పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. పట్టుబడిన బాబు, పవన్ గతంలోనూ ఇదే తరహాలో నేరం చేస్తూ పట్టుబడ్డారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు.
కంటెయినర్లో తీసుకొచ్చి..: గోవా నుంచి కంటెయినర్లో మద్యాన్ని జిల్లాకు తరలించిన వ్యక్తి కూడా పాత నేరస్థుడేనని అధికారులు చెప్పారు. అతనితో పాటు గోవాలో వీరికి మద్యం సరఫరా చేసిన ఫ్రాన్సిస్ను కూడా నిందితుడిగా చేర్చారు. ఇక ఈ మద్యాన్ని బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్న వాయిల వెంకటేశ్వర్లు, వాయిల తిరుపతి, కటారి వెంకట్రావులను సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.మూడు లక్షల విలువైన మద్యంతో పాటు రవాణాకు వినియోగిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ దాడిలో కీలకపాత్ర పోషించిన సీఐ లత, ఎస్సై గోపాలకృష్ణ, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ ఎల్.హరిబాబులను ప్రత్యేకంగా అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల్లో గొప్పలు.. చేతల్లో అభాసు‘పాలు’
[ 30-11-2023]
వైకాపా ప్రభుత్వం 2020 నవంబర్లో జగనన్న పాల వెల్లువ పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా సంఘాల్లో పాలు పోసే మహిళా రైతులకు పాడి గేదెల కొనుగోలుకు ప్రభుత్వరంగ బ్యాంక్తో పాటు, పీడీసీసీ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించారు. -
అప్పుడు ఆరుష్.. ఇప్పుడు నిరీక్ష
[ 30-11-2023]
సాయంత్రం సమయంలో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు, గ్రామస్థులతో కలిసి ఆ రాత్రంతా గ్రామంలో వెతికారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఊరికి చేరుకున్నారు. -
మీరే భూచోళ్లు.. ఉన్నాయి ఆధారాలు
[ 30-11-2023]
‘అధికార పార్టీకి చెందిన మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి చేసిన భూ దందాలు, అవినీతి అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి. కొన్ని ఆడియో టేపులు కూడా భద్రపరిచాను. -
వాళ్లు కట్టారు.. వీళ్లు కక్షగట్టారు
[ 30-11-2023]
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన వైకాపా హామీలు గుప్పించింది. ఆచరణలో మాత్రం తగినన్ని నిధులు కేటాయించక తరచూ వాయిదాలతోనే సరిపెడుతూ వస్తోంది. ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవడం సంగతి అటుంచితే.. -
ఓటర్ల చేర్పులకు ప్రత్యేక శిబిరాలు
[ 30-11-2023]
అర్హులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు డిసెంబర్ 2, 3 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు, జిల్లాలోని ఈఆర్వోలతో ఒంగోలు ప్రకాశం భవన్లోని ఛాంబర్లో బుధవారం సమావేశం నిర్వహించారు. -
విభిన్నం.. ప్రతిభ అపారం
[ 30-11-2023]
క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని డీఆర్వో ఆర్.శ్రీలత సూచించారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు సంతపేటలోని డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. -
ఆరొందల ఏళ్లనాటి తెలుగు శాసనం లభ్యం
[ 30-11-2023]
యర్రగొండపాలెం మండలం నల్లమల అడవిలోని పొన్నలబయలు చెంచు గూడెంలో 600 ఏళ్లనాటి తెలుగు శిలా శాసనం వెలుగు చూసింది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి దేవరాయలు శకవత్సరం 1325 (క్రీ.శ 1404) ఏప్రిల్ నెల 14వ తేదీన ఈ శాసనం వేయించినట్లు దక్షిణ భారత పురావస్తుశాస్త్ర డైరెక్టర్ కె.మునిరత్నం నిర్ధారించినట్లు వై.పాలెంలోని చరిత్ర పరిశోధకులు, -
ఇటు క్రీడ.. అటు మేథ
[ 30-11-2023]
ఇటు క్రీడలు.. అటు చదువుల్లోనూ ఆ మెరికలు సత్తా చాటుతున్నారు. సాఫ్ట్, నెట్, బేస్బాల్ పోటీల్లోనే కాక.. మేథకు అద్దం పట్టే యువికా, సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనల్లో రాణిస్తున్నారు మంగమూరి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. ఇప్పటి వరకూ దాదాపు వందకు పైగా విద్యార్థులు ఇరు విభాగాల్లో రాణించి రాష్ట్రస్థాయిలో పాల్గొని రికార్డు సృష్టించారు. -
అనారోగ్యంతో ముగ్గురి బలవన్మరణం
[ 30-11-2023]
అనారోగ్య సమస్యలతో వేర్వేరుచోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం...మార్కాపురం భగత్సింగ్ కాలనీలో నివాసముంటున్న తాడిశెట్టి కేశవ(48) ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోని క్షయ విభాగంలో ఒప్పంద ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు