జగన్ మామది మోసమమ్మా.. నాన్నని డబ్బులు పంపమనవా!
బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు కాస్తా సం‘క్షామ’ గృహాలుగా మారిపోయాయి. గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు గత మూడేళ్లుగా; బీసీ, ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు
అందని సబ్బులు, తలనూనె సొమ్ములు
ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల ఎదురుచూపులు
బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు కాస్తా సం‘క్షామ’ గృహాలుగా మారిపోయాయి. గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు గత మూడేళ్లుగా; బీసీ, ఎస్సీ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఏడు నెలలుగా కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండేది అధికంగా పేద పిల్లలు. తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు ఉండకూడదన్న ఉద్దేశంతో కిలో మీటర్ల మేర దూరంలో ఉన్న వసతి గృహాలకు పంపుతున్నారు. ఉచిత వసతి, భోజనంతో పాటు, ఇతరత్రా చేతి ఖర్చులకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందని భావించి చేర్పిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. ప్రభుత్వం మాత్రం నెలవారీ కాస్మోటిక్ ఛార్జీల నగదు ఇవ్వడం లేదు. దీంతో తలకు నూనె కొనాలన్నా.. స్నానానికి సబ్బు కావాలన్నా ఇంటి వైపు చూడక తప్పడం లేదు. విధి లేక ప్రతి నెలా తమ తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసి ఖర్చులకు డబ్బులు పంపమని అడగడం పరిపాటిగా మారింది.
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
ఒంగోలు సంతపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల పుస్తక పఠనం
అందించాల్సిన నగదు ఇలా...: గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం నడుపుతోంది. ఇందులోని విద్యార్థులకు ప్రతి నెలా కాస్మోటిక్ ఛార్జీల కింద 3వ తరగతి నుంచి 6వ తరగతి బాలికలకు రూ.110; బాలురకు రూ.100 అందజేయాల్సి ఉంది. 7 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు రూ.160, బాలురకు రూ.125 చొప్పున తలనూనె, సబ్బులు, ఇతర సామగ్రి కొనుగోలుకు ఇస్తుంటుంది. అన్ని తరగతులకు చెందిన బాలురకు రూ.30 చొప్పున హెయిర్ కంటింగ్ ఛార్జీల కింద అదనంగా విడుదల చేస్తుంది. కరోనాకు ముందు విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే కాస్మోటిక్ ఛార్జీలను గిరిజన సొసైటీ ద్వారా అందించేవారు. సదరు నగదు మొత్తాన్ని సొసైటీలకు ప్రభుత్వం చెల్లించేది.
నేరుగా అంటూ పూర్తిగా నిలిపేసి...: విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకే నేరుగా కాస్మోటిక్ ఛార్జీలను చెల్లించనున్నట్లు 2020 ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2020 ఏప్రిల్ నుంచి విద్యార్థులకు నిధుల విడుదల నిలిచిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా జూన్ నెలలో వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ కాస్మోటిక్ ఛార్జీల ఊసేలేదు. దీంతో విద్యార్థులు ఇంటికెళ్లి తమ అవసరాల నిమిత్తం డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇది వారి తల్లిదండ్రులకు భారంగా మారింది.
బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాల్లోని విద్యార్థులకు ఈ ఏడాది జనవరి నెల వరకు కాస్మోటిక్ ఛార్జీలు అందజేశారు. గత విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్; ప్రస్తుత సంవత్సరానికి జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు విడుదల కావాల్సి ఉంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు నగదు చేతికి అందలేదు. దీంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఆశ్రయిస్తున్నారు.
సీఎఫ్ఎంఎస్లో తీసుకోవడం లేదు...
వసతి గృహాల్లోని విద్యార్థులకు జనవరి నెల వరకు కాస్మోటిక్ ఛార్జీలను వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేశాం. ఆ తర్వాత నుంచి కొంతమేర జాప్యం చోటుచేసుకున్నప్పటికీ ప్రస్తుతం బడ్జెట్ వచ్చింది. జూన్ నెల నుంచి ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పెరిగిన బిల్లులు అప్లోడ్ చేసినా సీఎఫ్ఎంఎస్లో తీసుకోవడం లేదు. త్వరలోనే సాంకేతిక సమస్య పరిష్కారం కానుంది.
అంజల, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్రాలు లేవంటూ పరిహారం ఎగవేత!
[ 02-12-2023]
రహదారి నిర్మాణం కోసం తమ జీవనాధారమైన భూములను వదులుకుంటున్న త్యాగధనులు ఆ రైతులు. భూములను కోల్పోతున్న వారి విషయంలో అధికార యంత్రాంగం సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
అదిగో తుపాను.. ఉద్యోగులకు సెలవులొద్దు
[ 02-12-2023]
మిచౌంగ్ తుపాను ప్రభావం జిల్లా పైనా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
తేలుస్తారా! అటకెక్కిస్తారా!!
[ 02-12-2023]
ముండ్లమూరు మండలం రెడ్డినగర్ గ్రామంలో ఆరుష్రెడ్డి అనే బాలుడు మూడేళ్ల క్రితం అపహరణకు గురయ్యాడు. పోలీసులు ప్రత్యేక బృందాలతో కొన్ని రోజులపాటు విస్తృతంగా గాలించినా ఆచూకీ దొరకలేదు. అనంతరం ఆ కేసు నుంచి పక్కకు వైదొలిగారు. -
హలో.. నేను లేను ఆమెకివ్వండి
[ 02-12-2023]
భూముల ఆన్లైన్ కోసం నగదు తీసుకుంటూ ఇద్దరు వీఆర్వోలు అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన చీమకుర్తి రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. -
సాగు నచ్చేలా.. మోదీ మెచ్చేలా..
[ 02-12-2023]
కరవు వెంటాడే కనిగిరి ప్రాంతానికి చెందిన ఆమె.. సిరులు పండించడంపై దృష్టి సారించారు. ఉన్నత విద్య అభ్యసించినా.. సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. డ్రోన్లతో వ్యవసాయం చేయడంపై శిక్షణ పొందడమే కాక సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీతో పాటు పలువురికి ఇలాంటి సాగు విధానాలపై వివరించి ఆకట్టుకున్నారు జిల్లాకు చెందిన వెంకట రమణమ్మ. -
జాబితాలో రోజుకో చిత్రం
[ 02-12-2023]
పై చిత్రంలో కన్పించే మహిళ పేరు బోడా సుమతి. ఈమెది పామూరు మండలం అయ్యవారిపల్లి. సాధారణ గృహిణి. ఈమెకు ఇదే గ్రామంలో ఓటు ఉంది. అయితే ఇవే ముఖ కవళికలు పలమనేరు నియోజకవర్గంలోని బోదిరెడ్డిపల్లిలో ఉన్న మహిళకు ఉన్నాయంటూ ఆమెకు నోటీసు రావడంతో ఆందోళన చెందుతున్నారు. -
ప్రణవి.. జాతీయ స్థాయిలో మెరిసి
[ 02-12-2023]
జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించిన ద్వారం ప్రణవిని ఎస్పీ మలికా గార్గ్ అభినందించారు. నవంబర్ 19 నుంచి 26 వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్ 66వ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. -
ఎయిడ్స్ బాధితులకు అన్నివిధాలా సాయం
[ 02-12-2023]
ఎయిడ్స్ బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తాను అండగా ఉంటామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. -
సుబ్బరామిరెడ్డి సేవలు చిరస్మరణీయం
[ 02-12-2023]
మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి జిల్లాలో అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 28వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. -
కలల ఇళ్లు.. పశువుల నిలయాలు
[ 02-12-2023]
ఇళ్లు.. కాలనీలు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. -
ఆ పాఠశాలలదంతా కనికట్టు
[ 02-12-2023]
విద్యార్థులు లేకున్నప్పటికీ ఉన్నట్టు చూపుతూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసుకోవాలని గిద్దలూరు, రాచర్లలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నించాయి. -
కూలీల ట్రాక్టర్ తొట్టె బోల్తా
[ 02-12-2023]
కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ తొట్టె బోల్తా పడి నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని శంకరాపురం గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
గిరిజన మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారయత్నం
[ 02-12-2023]
గిరిజన మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకు వెళ్ళి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య