అన్నీ ఉన్నా.. ప్రకాశించని పర్యాటకం
మారుతున్న జీవనశైలి కారణంగా తమ విధులు.. వృత్తి రీత్యా ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజైనా కుటుంబ సభ్యులతో సేదతీరాలనుకుంటుంటారు.
గత ప్రభుత్వ పనులే నేటికీ దిక్కు
సందర్శకులకు అసౌకర్యాల వెక్కిరింతలు
అభివృద్ధి ఊసే పట్టని పాలకులు
పాకల బీచ్లో అసంపూర్తిగా ఉన్న విశ్రాంతి, రెస్టారెంట్ భవనం
మారుతున్న జీవనశైలి కారణంగా తమ విధులు.. వృత్తి రీత్యా ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజైనా కుటుంబ సభ్యులతో సేదతీరాలనుకుంటుంటారు. వారాంతంలో కొద్దిపాటి ఉల్లాసాన్ని కోరుకోవడం సహజం. జిల్లాకు అయిదు మండలాల పరిధిలో 52 కి.మీ మేర విశాలమైన కోస్తా తీర ప్రాంతం ఓ ప్రత్యేకత. ఇందులో బీచ్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఎన్నో. గుండ్లకమ్మ జలాశయంతో పాటు, సీఎస్పురం మండలం భైరవకోన పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు పొందాయి. తీర ప్రాంతంతో పాటు, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ, త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానం ప్రాంతాలు పర్యాటకాభివృద్ధికి అనుకూలం. ఆయాచోట్ల తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో చేసిన పనులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఆ తర్వాత అసంపూర్తిగా మిగిలినవి నేటికీ అలానే వదిలేశారు. దీంతో ప్రభుత్వ పరంగా కనీస వసతులు లేక ఎక్కడకు వెళ్లినా వసతులు లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని బుధవారం నిర్వహించుకోనున్న సందర్భంగా జిల్లాలో అటకెక్కిన ప£ర్యాటక ప్రాంతాల అభివృద్ధిని తెలుపుతూ కథనం.
న్యూస్టుడే, కొత్తపట్నం
పాకలలో పక్కన పెట్టేశారు...
కొత్తపట్నం, సింగరాయకొండ మండలం పాకల బీచ్లు జిల్లాలో పేరెన్నికగన్నవి. ఆదివారం వస్తే ఆయా ప్రాంతాలు సందర్శకులతో కోలాహలంగా మారతాయి. అయినా ప్రభుత్వ పరంగా విశ్రాంత గదులు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా, ప్రత్యేకించి సముద్ర స్నానం అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవాలన్నా సమస్యగా మారింది. వారాంతపు సెలవు దినాల్లో ఒంగోలు నగరానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా కొత్తపట్నం బీచ్కు అధిక సంఖ్యలో వస్తుంటారు. కనిగిరి, కొండపి, కందుకూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి పాకల తీరానికి వెళ్తుంటారు. ఆ రెండు రోజుల్లో కనీసం రెండు వేల మందికి పైగానే సందర్శిస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో పాకల బీచ్లో విశ్రాంతి భవనం, రెస్టారెంట్, సీసీరోడ్డు, ఎల్ఈడీ దీపాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ నిమిత్తం రూ.4 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. అందులో తొలి విడతగా రూ.2 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత నిధులు లేని కారణంగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఎల్ఈడీ దీపాలున్నా నిర్వహణ లేదు.
మధ్యలోనే నిలిచిన నిర్మాణాలు...
సీఎస్పురం మండలం భైరవకోనలో త్రిముఖ దుర్గాంభదేవి కొలువై ఉన్నారు. చోళుల కాలంలోనే ఒకే రాతిపై అమ్మవారి విగ్రహం చుట్టూ ఎనిమిది ఆలయాలు నిర్మించారు. పక్కనే జలపాతం ఉంది. కొండల పైనుంచి వర్షాకాలం సీజన్లో నిరంతరం నీళ్లు పడుతుంటాయి. కార్తిక మాసంతో పాటు, మహా శివరాత్రి రోజున ఏటా వేల మంది భక్తులు ఆ నీటితో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇతర రోజుల్లోనూ జిల్లా వాసులతో పాటు, పొరుగు జిల్లాల భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఎప్పటి నుంచో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఉన్నా కనీస వసతులు కూడా సమకూర్చలేకపోయారు. తెదేపా ప్రభుత్వ హయాంలో వాటర్ పాల్, పార్కులు, సందర్శకుల విశ్రాంతి ప్రాంతం, అతిథి గృహం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. గతంలో కొన్ని పనులకు నిధులు మంజూరైనా 2019 తర్వాత ప్రారంభించకపోవడంతో రద్దు చేశారు. విశ్రాంతి గదులు, వాటర్ పాల్, కాటేజీ, పరిపాలనా భవన నిర్మాణాలు మధ్యలోనే ఆగాయి. తాగునీటి వసతి, మరుగుదొడ్లు నిర్మాణం ఊసేలేదు.
ప్రారంభానికి నోచక నాలుగున్నరేళ్లు...
ఒంగోలు నగరానికి 14 కిలో మీటర్ల దూరంలోనే గుండ్లకమ్మ జలాశయం ఉంది. ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లో ఒంగోలుకు చెందిన ఎక్కువ శాతం ఉద్యోగులు, నగర వాసులు తమ కుటుంబ సభ్యులతో ఈ ప్రాజెక్ట్కు వెళ్తుంటారు. ప్రత్యేకించి ఆదివారం పర్యాటకుల తాకిడితో ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2009లో బోటింగ్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.2.63 కోట్ల నిధులతో ఎనిమిది కాటేజీలు, రెస్టారెంట్, ఈత కొలను నిర్మించారు. అయినా నాలుగున్నరేళ్లగా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ప్రజాధనం వృథాగా మారింది. వీటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nellore: ప్రేమిస్తున్నానని.. ఫొటోలు తీసి బెదిరింపు
[ 01-12-2023]
ప్రేమిస్తున్నానని చెప్పాడు. నీవు లేకుంటే ఉండలేనన్నాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని బాలిక తండ్రికి పంపించి బెదిరించిన యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘వనిత’ కష్టాలు వీడాయి
[ 01-12-2023]
కనిగిరి మండలం గోసులవీడు సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న పాలపర్తి వనిత అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేదు. అనంతరం వైద్య పరీక్షల నివేదికలు అందజేసినా కనిగిరి అధికారులు విధుల్లోకి తీసుకోకుండా నెలల తరబడి ఇబ్బందులకు... -
పప్పన్నం.. పేదలకు దూరం
[ 01-12-2023]
ఈ నెలలో క్రిస్మస్ పర్వదినం.. వచ్చే నెలలో సంక్రాంతి పండగలున్నాయి. ఇలాంటి సమయంలోనూ పేదల ఇంట పప్పన్నం ఉడకని పరిస్థితి. కార్డుదారులకు ప్రతి నెలా అందించే కందిపప్పు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా నిలిపేయడమే ఇందుకు కారణం. -
ప్రధాని మోదీతో వర్చువల్ ముచ్చట
[ 01-12-2023]
సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అవగాహన సదస్సును సింగరాయకొండ మండలం పాకలలో గురువారం నిర్వహించారు. -
ప్చ్.. ఏం చేయాలన్నా డబ్బుల్లేవ్
[ 01-12-2023]
జిల్లాలోని ఏకైక బోధనాసుపత్రిలో అన్నీ సమస్యలే. ఆవరణలోనే కుప్పలుగా వ్యర్థాలుంటాయి. వాటి తొలగింపు ఉండదు. వందల సంఖ్యలో వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కూడా నామమాత్రం. మరుగుదొడ్ల వసతిదీ అదే దారి. -
వీరి వీరి గుమ్మడి పండు ఏ స్థానం ఎవరిది?
[ 01-12-2023]
అధికార పార్టీలో స్థానాల మార్పుపై ఇప్పుడు రసవత్తర చర్చ నడుస్తోంది. ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
వైకాపాది నయవంచన, నమ్మక ద్రోహం
[ 01-12-2023]
‘పార్లమెంట్లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తోంది. భాజపా చెప్పు కింద పార్టీలా వైకాపా మారింది’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ విమర్శించారు. -
జల రవాణా.. కలేనా!
[ 01-12-2023]
గతంలో జల రవాణాపరంగా బకింగ్హామ్ కాలువ ఓ వెలుగు వెలిగింది. వంద మీటర్ల వెడల్పుతో నిత్యం పడవల రాకపోకలతో రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యంతో ప్రాభవం కోల్పోయింది. -
నీటి ట్యాంకు పైనా రాజకీయ క్రీనీడ
[ 01-12-2023]
దాహార్తి తీర్చే పనులకూ రాజకీయ మకిలి అంటుతోంది. నీటి ట్యాంకును పాఠశాల స్థలంలోనే చేపట్టాలంటూ వైకాపా నేతలు మెలిక పెట్టారు. దీంతో కొర్రపాటివారిపాలెంలో చేపట్టనున్న ట్యాంకు నిర్మాణంపై గ్రహణం పడుతోంది. -
అధికారానికి ఒకలా... ప్రతిపక్షానికి మరోలా!
[ 01-12-2023]
నవంబరు 22న నగరంలో నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార యాత్ర, సభ సందర్భంగా... కర్నూలు రోడ్డులోని పైవంతెన నుంచి బాపూజీ మార్కెట్ వరకు రహదారి మొత్తాన్ని ఆ పార్టీ జెండాలు, తోరణాలతో నింపేశారు. -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
[ 01-12-2023]
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
అప్పు చెల్లించమంటే దాడి
[ 01-12-2023]
ఫొటోగ్రాఫర్పై దాడిచేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, సుమోటోగా స్వీకరించి దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. -
అత్యాచారం కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు
[ 01-12-2023]
బాలికపై అత్యాచారానికి పాల్పడిన చాగంటి వెంకటేశ్వర రెడ్డికి ఒంగోలు పోక్సో కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.ఎ. సోమశేఖర్ ఇరవై ఏళ్ల జైలుశిక్ష విధించారు.


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: వరల్డ్ కప్పై కాళ్లు.. నేనెక్కడా అగౌరవపర్చలేదు: మిచెల్ మార్ష్
-
Chandrababu: యువత భారీ బైక్ ర్యాలీ.. విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం
-
Dhootha web series review: నాగచైతన్య ఫస్ట్ వెబ్సిరీస్ ‘దూత’.. ఎలా ఉంది?
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!