ఒంగోలులో భూబకాసురులు
ఏదైనా స్థిరాస్తిపై కన్నేశారంటే పాత తేదీలతో వీలునామాలు పుట్టిస్తారు. ఆగమేఘాలపై దొంగ రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తారు. సొంతదారు తేరుకునేలోపే స్థలాన్ని వివాదాల్లోకి లాగుతారు. నయానో భయానో బెదిరించి రాజీకి రప్పిస్తారు.
నకిలీ వీలునామాల తయారీ
ఆనక దొంగ రిజిస్ట్రేషన్ల సృష్టి
వివాదాలు కల్పించి దోపిడీ
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మలికా గార్గ్.. చిత్రంలో ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఏదైనా స్థిరాస్తిపై కన్నేశారంటే పాత తేదీలతో వీలునామాలు పుట్టిస్తారు. ఆగమేఘాలపై దొంగ రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తారు. సొంతదారు తేరుకునేలోపే స్థలాన్ని వివాదాల్లోకి లాగుతారు. నయానో భయానో బెదిరించి రాజీకి రప్పిస్తారు. రూ.లక్షల్లో ముట్టజెబితే స్థలం తిరిగి సొంతదారు పరమవుతుంది. లేదని అడ్డం తిరిగితే న్యాయ వివాదంలోకి వెళ్తుంది. అనంతరం రాజీకి అవకాశం కల్పిస్తారు. ధర వారే నిర్ణయిస్తారు. ముట్టజెబితే అంతటితో వదిలేస్తారు. లేదంటే తాము చెప్పిన ధరకే విక్రయించాలని హుకుం జారీ చేస్తారు. ఇదీ ఒంగోలు కేంద్రంగా సాగుతున్న భూ బకాసురుల ఆగడాలు. వీరి దందాకు పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, వీలునామాలు, పెద్దఎత్తున స్టాంపులు స్వాధీనం చేసున్నారు.
- గుట్టలుగా నకిలీ స్టాంపులు, పత్రాలు..: లాయర్పేటకు చెందిన ఓ వ్యక్తిని ఒంగోలు తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో తనిఖీ చేస్తుండగా లభించిన నకిలీ స్టాంపులు, పత్రాలను చూసి అవాక్కయ్యారు. గుట్టలు గుట్టలుగా ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి నిందితుడిని విచారించారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో సుమారు 400 నకిలీ పత్రాలు సృష్టించి సంబంధిత భూములను వివాదాల్లోకి లాగినట్లు ప్రాథమిక విచారణలో భాగంగా తెలుసుకున్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తుల ద్వారా వాటిని సెటిల్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులు అధికార పార్టీలో పలుకుబడి కలిగిన వారు కావటంతో పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది.
నలుగురు నిందితుల అరెస్టు..: మలికా గార్గ్, ఎస్పీ
నకిలీ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల కేసులో ఒంగోలుకు చెందిన లాయర్పేట నాలుగోలైనుకు చెందిన చితిరాల పూర్ణచంద్రరావు, రాజాపానగల్ రోడ్డు నాలుగో లైన్ నివాసి అయినాబత్తిన యానాదిరావు, సంతపేటకు చెందిన గొర్రెపాటి రవీంద్రబాబు, సీతారామపురానికి చెందిన మేడికొండల విష్ణువర్ధన్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. వీరి వద్ద నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు సుమారు పదిహేనేళ్లుగా నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడినట్లు తెలిసిందని చెప్పారు. ఈ కేసులో మరికొందరు నిందితులున్నారని, వారిని కూడా అరెస్టు చేసి విచారించనున్నట్లు తెలిపారు. వీరి చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, తాలూకా పోలీసు స్టేషన్లలో సంప్రదించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిందితుల అరెస్టు, నకిలీ పత్రాలు జప్తు చేసిన సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్సై మల్లిఖార్జునరావు, హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుళ్లు హనోక్, శ్రీనివాసరావు, రత్తయ్య, హోంగార్డు వాసులను ఎస్పీ గార్గ్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nellore: ప్రేమిస్తున్నానని.. ఫొటోలు తీసి బెదిరింపు
[ 01-12-2023]
ప్రేమిస్తున్నానని చెప్పాడు. నీవు లేకుంటే ఉండలేనన్నాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని బాలిక తండ్రికి పంపించి బెదిరించిన యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘వనిత’ కష్టాలు వీడాయి
[ 01-12-2023]
కనిగిరి మండలం గోసులవీడు సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న పాలపర్తి వనిత అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేదు. అనంతరం వైద్య పరీక్షల నివేదికలు అందజేసినా కనిగిరి అధికారులు విధుల్లోకి తీసుకోకుండా నెలల తరబడి ఇబ్బందులకు... -
పప్పన్నం.. పేదలకు దూరం
[ 01-12-2023]
ఈ నెలలో క్రిస్మస్ పర్వదినం.. వచ్చే నెలలో సంక్రాంతి పండగలున్నాయి. ఇలాంటి సమయంలోనూ పేదల ఇంట పప్పన్నం ఉడకని పరిస్థితి. కార్డుదారులకు ప్రతి నెలా అందించే కందిపప్పు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా నిలిపేయడమే ఇందుకు కారణం. -
ప్రధాని మోదీతో వర్చువల్ ముచ్చట
[ 01-12-2023]
సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అవగాహన సదస్సును సింగరాయకొండ మండలం పాకలలో గురువారం నిర్వహించారు. -
ప్చ్.. ఏం చేయాలన్నా డబ్బుల్లేవ్
[ 01-12-2023]
జిల్లాలోని ఏకైక బోధనాసుపత్రిలో అన్నీ సమస్యలే. ఆవరణలోనే కుప్పలుగా వ్యర్థాలుంటాయి. వాటి తొలగింపు ఉండదు. వందల సంఖ్యలో వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కూడా నామమాత్రం. మరుగుదొడ్ల వసతిదీ అదే దారి. -
వీరి వీరి గుమ్మడి పండు ఏ స్థానం ఎవరిది?
[ 01-12-2023]
అధికార పార్టీలో స్థానాల మార్పుపై ఇప్పుడు రసవత్తర చర్చ నడుస్తోంది. ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
వైకాపాది నయవంచన, నమ్మక ద్రోహం
[ 01-12-2023]
‘పార్లమెంట్లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తోంది. భాజపా చెప్పు కింద పార్టీలా వైకాపా మారింది’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ విమర్శించారు. -
జల రవాణా.. కలేనా!
[ 01-12-2023]
గతంలో జల రవాణాపరంగా బకింగ్హామ్ కాలువ ఓ వెలుగు వెలిగింది. వంద మీటర్ల వెడల్పుతో నిత్యం పడవల రాకపోకలతో రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యంతో ప్రాభవం కోల్పోయింది. -
నీటి ట్యాంకు పైనా రాజకీయ క్రీనీడ
[ 01-12-2023]
దాహార్తి తీర్చే పనులకూ రాజకీయ మకిలి అంటుతోంది. నీటి ట్యాంకును పాఠశాల స్థలంలోనే చేపట్టాలంటూ వైకాపా నేతలు మెలిక పెట్టారు. దీంతో కొర్రపాటివారిపాలెంలో చేపట్టనున్న ట్యాంకు నిర్మాణంపై గ్రహణం పడుతోంది. -
అధికారానికి ఒకలా... ప్రతిపక్షానికి మరోలా!
[ 01-12-2023]
నవంబరు 22న నగరంలో నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార యాత్ర, సభ సందర్భంగా... కర్నూలు రోడ్డులోని పైవంతెన నుంచి బాపూజీ మార్కెట్ వరకు రహదారి మొత్తాన్ని ఆ పార్టీ జెండాలు, తోరణాలతో నింపేశారు. -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
[ 01-12-2023]
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
అప్పు చెల్లించమంటే దాడి
[ 01-12-2023]
ఫొటోగ్రాఫర్పై దాడిచేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, సుమోటోగా స్వీకరించి దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. -
అత్యాచారం కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు
[ 01-12-2023]
బాలికపై అత్యాచారానికి పాల్పడిన చాగంటి వెంకటేశ్వర రెడ్డికి ఒంగోలు పోక్సో కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.ఎ. సోమశేఖర్ ఇరవై ఏళ్ల జైలుశిక్ష విధించారు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/12/2023)
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
-
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
-
Chandrababu: సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయం
-
Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
-
ఆ మాజీ నేవీ అధికారుల్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు!