ఉప్పుగుండూరులో స్వాహాపర్వం
అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీలో జల్జీవన్ మిషన్ నిధుల్ని ఆ పార్టీ నేతలు దిగమింగినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
వైకాపా నేతల జేబుల్లోకి జల్జీవన్ నిధులు
ఉప్పుగుండూరు పంచాయతీ కార్యాలయం
అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీలో జల్జీవన్ మిషన్ నిధుల్ని ఆ పార్టీ నేతలు దిగమింగినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
న్యూస్టుడే, నాగులుప్పలపాడు: నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీ అవినీతికి అడ్డాగా మారింది. ప్రత్యేకాధికారుల పాలన నుంచి ..తాజాగా జలజీవన్ నిధుల దుర్వినియోగం వరకూ అక్రమార్కులు ఆడిందే ఆటగా మారింది. కుళాయిలు లేని ఇళ్లకు ఉచితంగా కనెక్షన్లు మంజూరు చేసి నీళ్లు అందించాలన్నది జలజీవన్ మిషన్ లక్ష్యం. ఇందులో భాగంగా ఉప్పుగుండూరు పంచాయతీకు రూ. 55 లక్షలు మంజూరయ్యాయి. గ్రామసభ నిర్వహించి కుళాయిల ఏర్పాటుకు తీర్మానం చేయాల్సివుండగా, ఇదెక్కడా అమలు జరగలేదు. స్థానికంగా 53 మందికి కనెక్షన్లు మంజూరుకాగా, అధికార పార్టీ నేతలు చక్రంతిప్పి ఇప్పటికే కుళాయిలున్న 30 మందికి వీటిని మంజూరు చేయించినట్లు చూపించి నిధులు దిగమింగారు.
తీర్మానం లేకుండానే..
ఎలాంటి తీర్మానం లేకుండా కుళాయిలు ఎలా మంజూరు చేశారని ఈ నెల 19న పంచాయతీ పాలకవర్గ సమావేశంలో వార్డు మెంబర్లు ప్రశ్నించడంతో ఈ దోపిడీ పర్వం వెలుగులోకి వచ్చింది. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉండగా, ఒకే సామాజిక వర్గానికి ఎలా మంజూరు చేశారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ పేర్లు జాబితాలో ఎలా చేర్చారని వారు నిలదీస్తున్నారు. ఇందులో పంచాయతీ సిబ్బంది పేర్లు కూడా ఉండటం విశేషం.
గతంలోనూ ఇదే తీరు..
రెండేళ్ల క్రితం ఉప్పుగుండూరులో కుళాయి కనెక్షన్ల మంజూరులో రూ. 25 లక్షల అవినీతి జరిగింది. అప్పట్లో ఒక్కో కనెన్షన్ ఇవ్వడానికి దాదాపు రూ.15వేల చొప్పున దండుకున్నారు. ఇటీవల స్వయంగా సర్పంచి జయమ్మ పంచాయతీలో తాజాగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీవో పద్మావతి ఇరవై రోజుల క్రితం విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nellore: ప్రేమిస్తున్నానని.. ఫొటోలు తీసి బెదిరింపు
[ 01-12-2023]
ప్రేమిస్తున్నానని చెప్పాడు. నీవు లేకుంటే ఉండలేనన్నాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని బాలిక తండ్రికి పంపించి బెదిరించిన యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘వనిత’ కష్టాలు వీడాయి
[ 01-12-2023]
కనిగిరి మండలం గోసులవీడు సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న పాలపర్తి వనిత అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేదు. అనంతరం వైద్య పరీక్షల నివేదికలు అందజేసినా కనిగిరి అధికారులు విధుల్లోకి తీసుకోకుండా నెలల తరబడి ఇబ్బందులకు... -
పప్పన్నం.. పేదలకు దూరం
[ 01-12-2023]
ఈ నెలలో క్రిస్మస్ పర్వదినం.. వచ్చే నెలలో సంక్రాంతి పండగలున్నాయి. ఇలాంటి సమయంలోనూ పేదల ఇంట పప్పన్నం ఉడకని పరిస్థితి. కార్డుదారులకు ప్రతి నెలా అందించే కందిపప్పు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా నిలిపేయడమే ఇందుకు కారణం. -
ప్రధాని మోదీతో వర్చువల్ ముచ్చట
[ 01-12-2023]
సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అవగాహన సదస్సును సింగరాయకొండ మండలం పాకలలో గురువారం నిర్వహించారు. -
ప్చ్.. ఏం చేయాలన్నా డబ్బుల్లేవ్
[ 01-12-2023]
జిల్లాలోని ఏకైక బోధనాసుపత్రిలో అన్నీ సమస్యలే. ఆవరణలోనే కుప్పలుగా వ్యర్థాలుంటాయి. వాటి తొలగింపు ఉండదు. వందల సంఖ్యలో వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కూడా నామమాత్రం. మరుగుదొడ్ల వసతిదీ అదే దారి. -
వీరి వీరి గుమ్మడి పండు ఏ స్థానం ఎవరిది?
[ 01-12-2023]
అధికార పార్టీలో స్థానాల మార్పుపై ఇప్పుడు రసవత్తర చర్చ నడుస్తోంది. ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
వైకాపాది నయవంచన, నమ్మక ద్రోహం
[ 01-12-2023]
‘పార్లమెంట్లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తోంది. భాజపా చెప్పు కింద పార్టీలా వైకాపా మారింది’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ విమర్శించారు. -
జల రవాణా.. కలేనా!
[ 01-12-2023]
గతంలో జల రవాణాపరంగా బకింగ్హామ్ కాలువ ఓ వెలుగు వెలిగింది. వంద మీటర్ల వెడల్పుతో నిత్యం పడవల రాకపోకలతో రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యంతో ప్రాభవం కోల్పోయింది. -
నీటి ట్యాంకు పైనా రాజకీయ క్రీనీడ
[ 01-12-2023]
దాహార్తి తీర్చే పనులకూ రాజకీయ మకిలి అంటుతోంది. నీటి ట్యాంకును పాఠశాల స్థలంలోనే చేపట్టాలంటూ వైకాపా నేతలు మెలిక పెట్టారు. దీంతో కొర్రపాటివారిపాలెంలో చేపట్టనున్న ట్యాంకు నిర్మాణంపై గ్రహణం పడుతోంది. -
అధికారానికి ఒకలా... ప్రతిపక్షానికి మరోలా!
[ 01-12-2023]
నవంబరు 22న నగరంలో నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార యాత్ర, సభ సందర్భంగా... కర్నూలు రోడ్డులోని పైవంతెన నుంచి బాపూజీ మార్కెట్ వరకు రహదారి మొత్తాన్ని ఆ పార్టీ జెండాలు, తోరణాలతో నింపేశారు. -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
[ 01-12-2023]
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
అప్పు చెల్లించమంటే దాడి
[ 01-12-2023]
ఫొటోగ్రాఫర్పై దాడిచేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, సుమోటోగా స్వీకరించి దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. -
అత్యాచారం కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు
[ 01-12-2023]
బాలికపై అత్యాచారానికి పాల్పడిన చాగంటి వెంకటేశ్వర రెడ్డికి ఒంగోలు పోక్సో కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.ఎ. సోమశేఖర్ ఇరవై ఏళ్ల జైలుశిక్ష విధించారు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/12/2023)
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
-
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
-
Chandrababu: సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయం
-
Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
-
ఆ మాజీ నేవీ అధికారుల్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు!