ఓపీఎస్ సాధించే వరకు పోరాటం
రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేసేంతవరకు తాము పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు
పొదిలిలో జెండావిష్కరణలో మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు, చిత్రంలో సంఘం నేతలు
పొదిలి, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేసేంతవరకు తాము పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర జాత పొదిలికి చేరింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెమ్మని బాలవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొదిలి ప్రాంతీయ కార్యాలయంలో యూటీఎఫ్ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలుచేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగులను మోసం చేయడం ఎంతవరకు సబబన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని యూటీఎఫ్ ఫూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేబినెట్లో ముఖ్యమంత్రి పునరాలోచించి పాత పెన్షన్ విధానానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోతో ప్రభుత్వ పాఠశాలలు కుంటుపడుతున్నాయన్నారు. ప్రాథమిక విద్య కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు అక్టోబరు 1న విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. 15 వేల మంది ఉపాధ్యాయులు తమ గొంతుకను వినిపించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఓవీ.వీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రవి, సహాధ్యక్షుడు అబ్దుల్హై, నాయకులు బాలవెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, జి.రమేష్, బుజ్జిబాబు, చవలం వెంకటేశ్వర్లు, జి.శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, ఎస్.సుబ్బారావు, ఆంజనేయరెడ్డి, నరసారెడ్డి, అనిల్కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హలో.. నేను లేను ఆమెకివ్వండి’
[ 02-12-2023]
భూముల ఆన్లైన్ కోసం నగదు తీసుకుంటూ ఇద్దరు వీఆర్వోలు అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన చీమకుర్తి రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. -
పత్రాలు లేవంటూ పరిహారం ఎగవేత!
[ 02-12-2023]
రహదారి నిర్మాణం కోసం తమ జీవనాధారమైన భూములను వదులుకుంటున్న త్యాగధనులు ఆ రైతులు. భూములను కోల్పోతున్న వారి విషయంలో అధికార యంత్రాంగం సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
అదిగో తుపాను.. ఉద్యోగులకు సెలవులొద్దు
[ 02-12-2023]
మిచౌంగ్ తుపాను ప్రభావం జిల్లా పైనా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
తేలుస్తారా! అటకెక్కిస్తారా!!
[ 02-12-2023]
ముండ్లమూరు మండలం రెడ్డినగర్ గ్రామంలో ఆరుష్రెడ్డి అనే బాలుడు మూడేళ్ల క్రితం అపహరణకు గురయ్యాడు. పోలీసులు ప్రత్యేక బృందాలతో కొన్ని రోజులపాటు విస్తృతంగా గాలించినా ఆచూకీ దొరకలేదు. అనంతరం ఆ కేసు నుంచి పక్కకు వైదొలిగారు. -
సాగు నచ్చేలా.. మోదీ మెచ్చేలా..
[ 02-12-2023]
కరవు వెంటాడే కనిగిరి ప్రాంతానికి చెందిన ఆమె.. సిరులు పండించడంపై దృష్టి సారించారు. ఉన్నత విద్య అభ్యసించినా.. సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. డ్రోన్లతో వ్యవసాయం చేయడంపై శిక్షణ పొందడమే కాక సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీతో పాటు పలువురికి ఇలాంటి సాగు విధానాలపై వివరించి ఆకట్టుకున్నారు జిల్లాకు చెందిన వెంకట రమణమ్మ. -
జాబితాలో రోజుకో చిత్రం
[ 02-12-2023]
పై చిత్రంలో కన్పించే మహిళ పేరు బోడా సుమతి. ఈమెది పామూరు మండలం అయ్యవారిపల్లి. సాధారణ గృహిణి. ఈమెకు ఇదే గ్రామంలో ఓటు ఉంది. అయితే ఇవే ముఖ కవళికలు పలమనేరు నియోజకవర్గంలోని బోదిరెడ్డిపల్లిలో ఉన్న మహిళకు ఉన్నాయంటూ ఆమెకు నోటీసు రావడంతో ఆందోళన చెందుతున్నారు. -
ప్రణవి.. జాతీయ స్థాయిలో మెరిసి
[ 02-12-2023]
జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించిన ద్వారం ప్రణవిని ఎస్పీ మలికా గార్గ్ అభినందించారు. నవంబర్ 19 నుంచి 26 వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్ 66వ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. -
ఎయిడ్స్ బాధితులకు అన్నివిధాలా సాయం
[ 02-12-2023]
ఎయిడ్స్ బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తాను అండగా ఉంటామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. -
సుబ్బరామిరెడ్డి సేవలు చిరస్మరణీయం
[ 02-12-2023]
మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి జిల్లాలో అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 28వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. -
కలల ఇళ్లు.. పశువుల నిలయాలు
[ 02-12-2023]
ఇళ్లు.. కాలనీలు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. -
ఆ పాఠశాలలదంతా కనికట్టు
[ 02-12-2023]
విద్యార్థులు లేకున్నప్పటికీ ఉన్నట్టు చూపుతూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసుకోవాలని గిద్దలూరు, రాచర్లలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నించాయి. -
కూలీల ట్రాక్టర్ తొట్టె బోల్తా
[ 02-12-2023]
కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ తొట్టె బోల్తా పడి నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని శంకరాపురం గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
గిరిజన మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారయత్నం
[ 02-12-2023]
గిరిజన మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకు వెళ్ళి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Mitchell Marsh: వరల్డ్ కప్పై మళ్లీ అలాగే కాళ్లు పెడతా: మార్ష్
-
Hyderabad: కుమార్తెకు సొంత వైద్యం.. ప్రాణం మీదకు తెచ్చిన తండ్రి
-
Rahul Gandhi: వచ్చే పదేళ్లలో 50% మహిళా సీఎంలే ఉండేలా పనిచేద్దాం: రాహుల్
-
Pro Kabaddi League: కూతకు వేళాయె.. నేటి నుంచే ప్రొ కబడ్డీ సీజన్-10
-
AP News: అమరావతి బాండ్కు అథోగతి
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి