పొరుగు మద్యం కట్టడికి సరిహద్దుల్లో నిఘా
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి తరలిరాకుండా సరిహద్దు స్టేషన్లలో నిఘా తీవ్రతరం చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ మలికా గార్గ్
ప్రశంసా పత్రాలు పొందిన సెబ్ అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ మలికా గార్గ్
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం జిల్లాలోకి తరలిరాకుండా సరిహద్దు స్టేషన్లలో నిఘా తీవ్రతరం చేయాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అధికారులతో ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సెబ్ అధికారులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుని అక్రమ మద్యంపై నిఘా పెంచి అక్రమార్కులను కట్టడి చేయాలని సూచించారు. గంజాయి, సారా నిరోధానికి కృషి చేయాలని చెప్పారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా జరుగుతోంది, వినియోగదారులు ఎవరనేది గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, జూదం కట్టడికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలన్నారు. జిల్లాలో గంజాయి, సారా కట్టడికి కృషిచేసిన సెబ్ సీఐ రాగమయి, ఎస్సైలు శ్రీనగేష్, ఎం.వి.గోపాలకృష్ణ, కె.శ్రీనివాసులు, సిబ్బంది శామ్యూల్, శ్రీనివాసులు, మాధవరావు, వెంకటేశ్వర్లుకు సెబ్ కమిషనర్ రవిప్రకాష్ పంపించిన ప్రశంసాపత్రాలను ఎస్పీ గార్గ్ అందజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకోవటంలో ప్రతిభచూపిన ఇన్స్పెక్టర్ వంశీధర్, సెబ్ సీఐ బి.లత, మార్కాపురం సీఐ రాగమయి, సింగరాయకొండ ఎస్సై దయాకర్, డీటీఎఫ్ ఎస్సైలు శ్రీనివాసులు, గోపాలకృష్ణ, సిబ్బంది కోటేశ్వరరావు, హరిబాబులను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సెబ్ ఏఈఎస్లు సుధీర్బాబు, దేవదత్ తదితరులు పాల్గొన్నారు.
తపాలా ఖాతాదారులకు కుచ్చుటోపీ!
రూ.10 లక్షలకు పైగా నగదు జమ చేయని ఉద్యోగి
కురిచేడు, న్యూస్టుడే: తపాలా ఖాతాదారులకు ఓ ఉద్యోగి కుచ్చుటోపీ పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కెళితే.. పుల్లలచెరువు మండలం మర్రివేముల గ్రామానికి చెందిన పమిడి భావన్నారాయణ తన అత్తగారి గ్రామమైన కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో ఉంటూ దర్శి మండలం చలివేంద్ర గ్రామంలోని తపాలా కార్యాలయంలో బీపీఎంగా పనిచేస్తున్నారు. ఆరు నెలలుగా పలువురు ఖాతాదారుల దగ్గర ఆర్డీ రూపంలో నగదు వసూలు చేసి వారి ఖాతాల్లో జమ చేయకుండా కేవలం పుస్తకాల్లో మాత్రమే రాసి చూపించారు. ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది ఖాతాదారులు నెలరోజుల క్రితం తపాలా కార్యాలయానికి వెళ్లి నిలదీయగా మోసం వెలుగుచూసింది. సుమారు రూ.10 లక్షలకు పైగా నగదు గల్లంతు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కార్యాలయానికి వచ్చి పూర్తి విచారణ చేయకుండా మమ అనిపించారు. ఖాతాదారులు పలుమార్లు భావన్నారాయణను తమ నగదు తిరిగి చెల్లించాలని కోరారు. కొంత సమయం ఇస్తే అందరి డబ్బులు చెల్లిస్తానని చెప్పి అతడు కాలయాపన చేస్తుండటంతో వారు మోసపోయినట్లు గుర్తించి తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. కాగా, తన భర్త వారం రోజుల నుంచి కనిపించడం లేదని భావన్నారాయణ భార్య మల్లేశ్వరి కురిచేడు పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ విఘ్నేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హలో.. నేను లేను ఆమెకివ్వండి’
[ 02-12-2023]
భూముల ఆన్లైన్ కోసం నగదు తీసుకుంటూ ఇద్దరు వీఆర్వోలు అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన చీమకుర్తి రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. -
పత్రాలు లేవంటూ పరిహారం ఎగవేత!
[ 02-12-2023]
రహదారి నిర్మాణం కోసం తమ జీవనాధారమైన భూములను వదులుకుంటున్న త్యాగధనులు ఆ రైతులు. భూములను కోల్పోతున్న వారి విషయంలో అధికార యంత్రాంగం సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
అదిగో తుపాను.. ఉద్యోగులకు సెలవులొద్దు
[ 02-12-2023]
మిచౌంగ్ తుపాను ప్రభావం జిల్లా పైనా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
తేలుస్తారా! అటకెక్కిస్తారా!!
[ 02-12-2023]
ముండ్లమూరు మండలం రెడ్డినగర్ గ్రామంలో ఆరుష్రెడ్డి అనే బాలుడు మూడేళ్ల క్రితం అపహరణకు గురయ్యాడు. పోలీసులు ప్రత్యేక బృందాలతో కొన్ని రోజులపాటు విస్తృతంగా గాలించినా ఆచూకీ దొరకలేదు. అనంతరం ఆ కేసు నుంచి పక్కకు వైదొలిగారు. -
సాగు నచ్చేలా.. మోదీ మెచ్చేలా..
[ 02-12-2023]
కరవు వెంటాడే కనిగిరి ప్రాంతానికి చెందిన ఆమె.. సిరులు పండించడంపై దృష్టి సారించారు. ఉన్నత విద్య అభ్యసించినా.. సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. డ్రోన్లతో వ్యవసాయం చేయడంపై శిక్షణ పొందడమే కాక సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీతో పాటు పలువురికి ఇలాంటి సాగు విధానాలపై వివరించి ఆకట్టుకున్నారు జిల్లాకు చెందిన వెంకట రమణమ్మ. -
జాబితాలో రోజుకో చిత్రం
[ 02-12-2023]
పై చిత్రంలో కన్పించే మహిళ పేరు బోడా సుమతి. ఈమెది పామూరు మండలం అయ్యవారిపల్లి. సాధారణ గృహిణి. ఈమెకు ఇదే గ్రామంలో ఓటు ఉంది. అయితే ఇవే ముఖ కవళికలు పలమనేరు నియోజకవర్గంలోని బోదిరెడ్డిపల్లిలో ఉన్న మహిళకు ఉన్నాయంటూ ఆమెకు నోటీసు రావడంతో ఆందోళన చెందుతున్నారు. -
ప్రణవి.. జాతీయ స్థాయిలో మెరిసి
[ 02-12-2023]
జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించిన ద్వారం ప్రణవిని ఎస్పీ మలికా గార్గ్ అభినందించారు. నవంబర్ 19 నుంచి 26 వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్ 66వ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. -
ఎయిడ్స్ బాధితులకు అన్నివిధాలా సాయం
[ 02-12-2023]
ఎయిడ్స్ బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తాను అండగా ఉంటామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. -
సుబ్బరామిరెడ్డి సేవలు చిరస్మరణీయం
[ 02-12-2023]
మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి జిల్లాలో అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన 28వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. -
కలల ఇళ్లు.. పశువుల నిలయాలు
[ 02-12-2023]
ఇళ్లు.. కాలనీలు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. -
ఆ పాఠశాలలదంతా కనికట్టు
[ 02-12-2023]
విద్యార్థులు లేకున్నప్పటికీ ఉన్నట్టు చూపుతూ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసుకోవాలని గిద్దలూరు, రాచర్లలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నించాయి. -
కూలీల ట్రాక్టర్ తొట్టె బోల్తా
[ 02-12-2023]
కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ తొట్టె బోల్తా పడి నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని శంకరాపురం గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
గిరిజన మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారయత్నం
[ 02-12-2023]
గిరిజన మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకు వెళ్ళి అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల