పెళ్లి చేసుకుంటావా! చావ మంటావా!!
పెళ్లి చేసుకుంటావా... చావ మంటావా అంటూ ఓ సైకో నాలుగు నెలలుగా వెంటపడుతుండటంతో ఆ విద్యార్థిని మనో వేదనకు గురైంది. తన వారికి చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక విలవిల్లాడింది.
వేధింపులతో విద్యార్థిని మౌన వేదన
ఎట్టకేలకు సైకోపై పోలీసులకు ఫిర్యాదు
కనిగిరి, న్యూస్టుడే: పెళ్లి చేసుకుంటావా... చావ మంటావా అంటూ ఓ సైకో నాలుగు నెలలుగా వెంటపడుతుండటంతో ఆ విద్యార్థిని మనో వేదనకు గురైంది. తన వారికి చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక విలవిల్లాడింది. ఎట్టకేలకు తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసుల్ని ఆశ్రయించగా, నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కనిగిరి పట్టణంలోని పాతూరు ప్రాంతానికి చెందిన బాలిక పట్టణంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లి ఒప్పంద ఉద్యోగి, తండ్రి పనుల నిమిత్తం తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి చదివే ఆ బాలిక, తన చెల్లెల్ని తోడుగా తీసుకుని ప్రతి రోజు పాఠశాలకు వెళ్తుండేది. పట్టణంలోని అదే ప్రాంతానికి చెందిన షేక్ నాయబ్ రసూల్ అనే ఆకతాయి ప్రతిరోజు ప్రేమించమని ఆమె వేధిస్తుండేవాడు. మోటార్ సైకిల్తో వెంటపడడం.. ప్రేమించవా .. పెళ్లి చేసుకోవా అంటూ బెదిరించేవాడు. నాలుగు నెలలుగా ఈ వెకిలిచేష్టలను ఆమె మౌనంగా భరించింది. దీన్ని అలుసుగా తీసుకున్న జులాయి మరింత పేట్రేగిపోయి తల్లిదండ్రులకే ఫోన్లు చేసి బెదిరించసాగాడు. దీంతో ఆందోళనకు గురైన తండ్రి తెలంగాణ నుంచి కనిగిరి వచ్చి ఈ నెల 23న పోలీస్ స్టేషన్ ఫిర్యాదుచేయగా, వారు బయట తేల్చుకోండంటూ చెప్పారు. ఆ విషయం తెలిసి సైకో మరింతగా రెచ్చిపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల 25న తిరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ప్రసాద్ నిందితుడు నాయబ్ రసూల్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అత్యాచారానికి పాల్పడిన బేల్దారీ మేస్త్రి అరెస్టు
దర్శి, న్యూస్టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన బేల్దారీ మేస్త్రిని పోలీసులు అరెస్టు చేశారు. దర్శి సీఐ రామకోటయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కెల్లంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామంలో బాలిక తన తల్లి, తమ్ముడితో కలిసి ఉంటోంది. ఈ నెల 22న అత్యవసర పని మీద వారు ముగ్గురు పొదిలి మండలం జాపలాపురానికి బయలుదేరారు. అయితే ఆటో అందుబాటులో లేకపోవడంతో దగ్గరి బంధువైన బేల్దారి మేస్త్రీ వెంకటరావును అక్కడికి తీసుకెళ్లాల్సిందిగా బాలిక తల్లి కోరింది. అతను తన ద్విచక్ర వాహనంపై వారిని అక్కడ వదిలిపెట్టాడు. 23న తన పిల్లలిద్దర్నీ స్వగ్రామంలో వదిలిపెట్టమని బాలిక తల్లి కోరడంతో అతను వారిని అక్కడికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఇంటి దగ్గర్లోనే ఉంటున్న అమ్మమ్మకు తెలిపింది. దీంతో బాధితులు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ రామకోటయ్య, ఎస్సై కృష్ణయ్య తన సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి ఉల్లగల్లు వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. కేసును త్వరితగతిన పరిష్కరించిన పోలీసులను జిల్లా ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.
కుటుంబ కలహాలతో గృహిణి బలవన్మరణం
అర్థవీడు, న్యూస్టుడే: కుటుంబ కలహాలతో ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మాగుటూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నల్లబోతుల ఆదిలక్ష్మి(32)పై అనుమానం పెంచుకున్న భర్త రోజూ వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఘర్షణ పడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆదిలక్ష్మి సోమవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత విష రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న హౌస్ రైటర్ గోపాల్రాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు.
నిమజ్జనానికి వెళ్లి యువకుడి దుర్మరణం
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు పరిధిలో పద్మనాభకుంటలో సోమవారం రాత్రి గల్లంతైన యువకులు మృతి చెందారు. గ్రామీణ ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. ముఖేష్తో కలిసి ప్రమాదంలో మృతి చెందిన మరో యువకుడు భాగ్యం ప్రవీణ్ తల్లిదండ్రులు పుల్లయ్య, విజయమ్మ. వారికి నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. చివరివాడు ప్రవీణ్. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చి పదేళ్ల క్రితం వచ్చి పనులు చేసుకంటూ బతుకుతున్నారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం కూడా విషాదంలో మునిగింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పీసీపల్లి: ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన బేల్దారి మేస్త్రీ బాలచెన్నారెడ్డి (43) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గోపవరపువారిపల్లికి చెందిన బాలచెన్నారెడ్డి తన భార్యతో కలసి సోమవారం రాత్రి పీసీపల్లి నుంచి శంకరాపురానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గంమధ్యలో వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బాలచెన్నారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఒంగోలులోని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య వెంగమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nellore: ప్రేమిస్తున్నానని.. ఫొటోలు తీసి బెదిరింపు
[ 01-12-2023]
ప్రేమిస్తున్నానని చెప్పాడు. నీవు లేకుంటే ఉండలేనన్నాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని బాలిక తండ్రికి పంపించి బెదిరించిన యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘వనిత’ కష్టాలు వీడాయి
[ 01-12-2023]
కనిగిరి మండలం గోసులవీడు సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న పాలపర్తి వనిత అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేదు. అనంతరం వైద్య పరీక్షల నివేదికలు అందజేసినా కనిగిరి అధికారులు విధుల్లోకి తీసుకోకుండా నెలల తరబడి ఇబ్బందులకు... -
పప్పన్నం.. పేదలకు దూరం
[ 01-12-2023]
ఈ నెలలో క్రిస్మస్ పర్వదినం.. వచ్చే నెలలో సంక్రాంతి పండగలున్నాయి. ఇలాంటి సమయంలోనూ పేదల ఇంట పప్పన్నం ఉడకని పరిస్థితి. కార్డుదారులకు ప్రతి నెలా అందించే కందిపప్పు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా నిలిపేయడమే ఇందుకు కారణం. -
ప్రధాని మోదీతో వర్చువల్ ముచ్చట
[ 01-12-2023]
సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అవగాహన సదస్సును సింగరాయకొండ మండలం పాకలలో గురువారం నిర్వహించారు. -
ప్చ్.. ఏం చేయాలన్నా డబ్బుల్లేవ్
[ 01-12-2023]
జిల్లాలోని ఏకైక బోధనాసుపత్రిలో అన్నీ సమస్యలే. ఆవరణలోనే కుప్పలుగా వ్యర్థాలుంటాయి. వాటి తొలగింపు ఉండదు. వందల సంఖ్యలో వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం కూడా నామమాత్రం. మరుగుదొడ్ల వసతిదీ అదే దారి. -
వీరి వీరి గుమ్మడి పండు ఏ స్థానం ఎవరిది?
[ 01-12-2023]
అధికార పార్టీలో స్థానాల మార్పుపై ఇప్పుడు రసవత్తర చర్చ నడుస్తోంది. ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
వైకాపాది నయవంచన, నమ్మక ద్రోహం
[ 01-12-2023]
‘పార్లమెంట్లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తోంది. భాజపా చెప్పు కింద పార్టీలా వైకాపా మారింది’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ విమర్శించారు. -
జల రవాణా.. కలేనా!
[ 01-12-2023]
గతంలో జల రవాణాపరంగా బకింగ్హామ్ కాలువ ఓ వెలుగు వెలిగింది. వంద మీటర్ల వెడల్పుతో నిత్యం పడవల రాకపోకలతో రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యంతో ప్రాభవం కోల్పోయింది. -
నీటి ట్యాంకు పైనా రాజకీయ క్రీనీడ
[ 01-12-2023]
దాహార్తి తీర్చే పనులకూ రాజకీయ మకిలి అంటుతోంది. నీటి ట్యాంకును పాఠశాల స్థలంలోనే చేపట్టాలంటూ వైకాపా నేతలు మెలిక పెట్టారు. దీంతో కొర్రపాటివారిపాలెంలో చేపట్టనున్న ట్యాంకు నిర్మాణంపై గ్రహణం పడుతోంది. -
అధికారానికి ఒకలా... ప్రతిపక్షానికి మరోలా!
[ 01-12-2023]
నవంబరు 22న నగరంలో నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార యాత్ర, సభ సందర్భంగా... కర్నూలు రోడ్డులోని పైవంతెన నుంచి బాపూజీ మార్కెట్ వరకు రహదారి మొత్తాన్ని ఆ పార్టీ జెండాలు, తోరణాలతో నింపేశారు. -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
[ 01-12-2023]
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
అప్పు చెల్లించమంటే దాడి
[ 01-12-2023]
ఫొటోగ్రాఫర్పై దాడిచేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, సుమోటోగా స్వీకరించి దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. -
అత్యాచారం కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు
[ 01-12-2023]
బాలికపై అత్యాచారానికి పాల్పడిన చాగంటి వెంకటేశ్వర రెడ్డికి ఒంగోలు పోక్సో కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.ఎ. సోమశేఖర్ ఇరవై ఏళ్ల జైలుశిక్ష విధించారు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ