Balakrishna : కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా సరే వస్తా : బాలకృష్ణ

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో ఇటీవల వైకాపా వర్గీయుల దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు.

Updated : 27 May 2022 16:06 IST

చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో ఇటీవల వైకాపా వర్గీయుల దాడిలో గాయపడ్డ తెదేపా కార్యకర్తలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. రెండ్రోజుల క్రితం తెదేపా కార్యకర్తలు నర్సింహమూర్తి, రవిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో వీరిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జరిగిన సంఘటన గురించి స్థానిక తెదేపా నేతలు.. బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం నియోజకవర్గవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బాలకృష్ణ.. కొడికొండ గ్రామానికి విచ్చేసి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ వైకాపా నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తెదేపా కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా సరే వస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని