ఆదమరిస్తే... మళ్లీ పోరాడాల్సిందే!
కరోనా వైరస్లో కొత్త రకం ‘ఒమిక్రాన్’ దేశంలోకి ప్రవేశించింది. రోజురోజుకీ వాటి కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో సాధారణ కొవిడ్ కేసులు ఇప్పటికీ నమోదవుతున్నాయి.
పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్సులో మాస్కు ధరించని ప్రయాణికులు
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్టుడే: కరోనా వైరస్లో కొత్త రకం ‘ఒమిక్రాన్’ దేశంలోకి ప్రవేశించింది. రోజురోజుకీ వాటి కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో సాధారణ కొవిడ్ కేసులు ఇప్పటికీ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాస్కు ధరించకపోతే రూ.100 అపరాధ రుసుం విధించాలని, సామూహిక కార్యక్రమాలకు అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
ఇదీ పరిస్థితి...
జిల్లావ్యాప్తంగా అధికారికంగా ఇప్పటివరకు 794 మంది కొవిడ్ కాటుకు ప్రాణాలు కోల్పోయారు. లెక్కల్లోకి రానివారు ఇంకా ఎందరో.. వారిపైన ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రజలు మాత్రం వాటన్నింటినీ మరచిపోయి వ్యవహరిస్తున్నారు. రైతుబజారు, మార్కెట్లు, పార్కులు, సినిమా థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. బస్సులు, ఆటోలు, రైళ్లలో ఇక సరేసరి. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
ముందుంది పండగల కాలం...: గత రెండు నెలలుగా శుభకార్యాలు, పండగల సందర్భంగా అధిక సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కార్తిక మాసంలో దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడటాన్ని మనం చూశాం. ఎక్కడా నిబంధనలు అమలైన దాఖలాలు లేవు. డిసెంబర్లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి, ఆ తరువాత మహాశివరాత్రి, ఉగాది ఇలా పండగలన్నీ వరుసగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ముప్పు తప్పదని నిపుణుల అభిప్రాయం.
చర్యలు చేపట్టాలి...: ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో జిల్లాలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అనుమానితులకు పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియనూ వేగవంతం చేయాలని కోరుతున్నారు. అర్హత ఉన్నవారందరికీ టీకా వేసేలా సిబ్బంది కృషి చేయాలి.
18 ఏళ్లు పైబడినవారు : 21,59,471
టీకా మొదటి డోసు వేయించుకున్నవారు : 17,82,131
రెండో డోసు వేయించుకున్నవారు : 12,05,629
నిబంధనలు పాటించాలి
కొవిడ్ మూడో దశ పొంచి ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలి. మాస్కు ధరించడం, శానిటైజర్ వినియోగాన్ని కొనసాగించాలి. టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలి. ఇప్పటికే జిల్లాలోని వైద్యాధికారులందరినీ అప్రమత్తం చేశాం. విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే పరీక్షలు జరపాలని, వివరాలు తెలపాలని ఆదేశించాం.
-డాక్టర్ బగాది జగన్నాథరావు, డీఎంహెచ్వో, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా