విషాదంలోనూ దాతృత్వం
విషాదంలోనూ ఓ కుటుంబం దాతృత్వం చూపింది. మరికొంతమందికి ప్రాణదానం చేసింది. దీనికి సంబంధించి అవయవదాత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పెదవాల్తేరు, న్యూస్టుడే: విషాదంలోనూ ఓ కుటుంబం దాతృత్వం చూపింది. మరికొంతమందికి ప్రాణదానం చేసింది. దీనికి సంబంధించి అవయవదాత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లావేరు మండలం కేశవరాయునిపాలెంకు చెందిన యతిరాజ్యం రామారావు (62) ఈనెల 2న రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడ నడుస్తూ పడిపోయారు. తలకు గాయమైంది. దీంతో అక్కడి వైద్యుల సలహా మేరకు ఈనెల 3వ తేదీ విశాఖ నగరంలోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. ఆసుపత్రి వర్గాలు అవయవదానం కోసం కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. భార్య రూపవతి, కుమారుడు, కుమార్తె అవయవదానం చేయడానికి అంగీకరించారు. దీంతో గుండెను చెన్నై ఎం.జి.హెచ్ ఆసుపత్రికి, కాలేయాన్ని విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి, నేత్రాలు ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె