పిలిచినా పలకరే..!
జలుమూరు మండలం లుకలాం నుంచి కొమనాపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. 5 కిలోమీటర్ల మేర దూరం ఉన్న ఈ దారిలో ప్రయాణించాలంటే అవస్థలే. మరమ్మతు కోసం రూ.2 కోట్ల పనులకు ఐదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.
- ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, జలుమూరు
జలుమూరు మండలం లుకలాం నుంచి కొమనాపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. 5 కిలోమీటర్ల మేర దూరం ఉన్న ఈ దారిలో ప్రయాణించాలంటే అవస్థలే. మరమ్మతు కోసం రూ.2 కోట్ల పనులకు ఐదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.
సారవకోట మండలం కొల్లివలస నుంచి గొల్లివలస మీదుగా వాసుదేవపట్నం వెళ్లే దారి దారుణంగా తయారైంది. పది కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గానికి రూ.1.95 కోట్లతో బాగు చేయాలని నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ రాలేదు.
జిల్లాలో ఆర్అండ్బీ రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి గ్రామాలకు చేరుకునేందుకు కీలకమైన దారులు ప్రయాణానికి వీలు లేకుండా మారిపోయాయి. 20 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణానికి కనీసం రెట్టింపు సమయం పడుతోంది. ఆయా రోడ్లపై అనుమతించిన వేగంతో వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే వీటన్నింటికీ మరమ్మతులు చేయించడానికి అధికారులు టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారుల నుంచి స్పందన ఉండటం లేదు.
సాధారణంగా పనులకు టెండర్లు ఎప్పుడు పిలుస్తారని గుత్తేదారులంతా ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 38 పనులను రూ.43.69 కోట్లతో చేసేందుకు జిల్లా అధికారులు టెండర్లు పిలిచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఆహ్వానించినా ఒక్క గుత్తేదారు నుంచీ స్పందన లేకపోవడం గమనార్హం.
బకాయిలిస్తేనే..
2019 వరకూ వివిధ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు నిలిచిపోయాయి. దాదాపు రెండేళ్ల పాటు ఏ ఒక్కరికీ చేసిన పనికి బిల్లులు అందలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుత్తేదారులంతా ఏకమయ్యారు. పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తే గాని కొత్తవి వేయబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల ధాటికి ప్రధాన రహదారులన్నీ బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర మరమ్మతుల పేరుతో ఏడు పనులకు సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో చీఫ్ ఇంజినీరు స్థాయిలో టెండర్లు పిలిచారు. అయినా ఒక్కరూ బిడ్ దాఖలు చేయలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ధరలు పెంచినా.. స్పందన లేదు
జిల్లాలో కొన్ని రహదారులకు అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా టెండరు దాఖలు గడువు కూడా పెంచాం. అయినా ఒక్కరూ బిడ్ దాఖలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా బిల్లులు చెల్లిస్తున్న నేపథ్యంలో త్వరలోనే గుత్తేదారులు స్పందించి టెండర్లు దాఖలు చేస్తారని ఆశిస్తున్నాం.
- కాంతిమతి, ఎస్ఈ, ఆర్అండ్బీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.