ఇక చాలు..కట్టేయండి!
చేయని పనులు చేసినట్లు..ఇవ్వని కూలీ ఇచ్చినట్లు..కొలతల్లో కనికట్టు చేసి నిధులు బొక్కేశారు. ‘ఉపాధి’ పనుల్లో ఏటా జరుగుతున్న ఈ తంతు సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో వీటిని ఖరారు చేసి రికవరీలకు ఆదేశాలిస్తున్నారు. ఇప్పటికి 13 రౌండ్లలో లెక్క కొలిక్కి తెచ్చారు
ఉపాధి నిధుల రికవరీకి చర్యలు
- న్యూస్టుడే, రాజాం
చేయని పనులు చేసినట్లు..ఇవ్వని కూలీ ఇచ్చినట్లు..కొలతల్లో కనికట్టు చేసి నిధులు బొక్కేశారు. ‘ఉపాధి’ పనుల్లో ఏటా జరుగుతున్న ఈ తంతు సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో వీటిని ఖరారు చేసి రికవరీలకు ఆదేశాలిస్తున్నారు. ఇప్పటికి 13 రౌండ్లలో లెక్క కొలిక్కి తెచ్చారు. ప్రస్తుతం 14వది కొనసాగుతోంది. దాదాపు రూ.కోటి వరకు ఇంకా రాబట్టాల్సి ఉందని తేల్చారు. వీటిని వసూలు చేసేందుకు చర్యలను ముమ్మరం చేశారు. వలసల నివారణ, వనరుల పెంపు లక్ష్యంగా ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నారు. ఈ పనుల్లో పుష్కర కాలంగా అవకతవకలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 2009-10 నుంచి ఇటీవల వరకూ గుర్తించిన అక్రమాల విలువ రూ.3.11 కోట్లుగా తేల్చారు. ఇందులో 68 శాతమే రికవరీ చేశారు. మిగిలిన 32 శాతం రాబట్టడంలో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది.
ఆర్ఆర్ అస్త్రం ఏదీ?
2010-11కు సంబంధించి రూ.34.10 లక్షలు ఇంకా రాబట్టాల్సి ఉంది. ఇలా ఏటా పక్కతోవ పడుతున్న నిధుల చిట్టా పెరిగిపోయింది. రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్) ప్రయోగించి నిధులు రాబట్టాలని డ్వామా అధికారులు ప్రతిపాదించినా ఆచరణలోకి రావటం లేదు. ముక్కుపిండి ప్రజాధనం రాబట్టాల్సిన అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదన్న వాదన వినపడుతోంది. ఆర్ఆర్ చట్టం ద్వారా రూ.89,09,365 రాబట్టాలని ప్రతిపాదించారు. మిగిలిన రూ.10,90,531 డ్వామా అధికారులు వసూలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అంతర్గత సమావేశాలు నిర్వహించి కొలిక్కి తెస్తున్నారు. ఇప్పటికే రాజాం నియోజకవర్గంలోని బాధ్యులతో సమావేశం నిర్వహించారు.
మళ్లీ మళ్లీ అదే తీరు
ఉపాధి నిధులు ఎవరి వద్ద నుంచి ఎంతెంత మొత్తాలు వసూలు చేయాలన్న లెక్క తేలింది. క్షేత్ర సహాయకులు, మేట్లు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, ఏపీవోల నుంచి ఈ మొత్తాలను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొందరు చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారు. అన్నీ అక్రమాలుగా చెప్పలేమని, ఇందులో వివిధ తప్పిదాల వల్ల నిధుల రికవరీలకు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కొలిక్కి తెస్తున్నాం
రూ.కోటి వరకు నిధులు రికవరీ చేయాల్సి ఉంది. జరిగినవన్నీ అక్రమాలని చెప్పలేం. అందుకే అంతర్గత సమావేశాలు నిర్వహించి వారితో చర్చించి కొంత వెసులుబాటు కల్పిస్తున్నాం. నిక్కచ్చిగా ఎంత మేర రాబట్టాలన్నది తేల్చి కట్టేయమని చెబుతున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద రూ.89 లక్షల వరకు రాబట్టాలని నిర్ణయించాం. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాం.
-హనుమంతు కూర్మారావు, పీడీ, డ్వామా, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...