logo

AP News: ‘జగన్‌ మళ్లీ సీఎం కాకుంటే రాజకీయ సన్యాసం చేస్తా’

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. నగరంలో సిక్కోలు డ్వాక్రా బజార్‌ ప్రారంభోత్సవం, నరసన్నపేట లో

Updated : 04 Jan 2022 09:32 IST

నరసన్నపేట సభలో మాట్లాడుతున్న కృష్ణదాస్‌
 
శ్రీకాకుళం అర్బన్‌/ నరసన్నపేట, న్యూస్‌టుడే: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. నగరంలో సిక్కోలు డ్వాక్రా బజార్‌ ప్రారంభోత్సవం, నరసన్నపేట లో ఇంటిహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణాలిచ్చే నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రంలో 50 శాతం మహిళలు, సచివాలయ వ్యవస్థ ఉందన్నారు. తెదేపా చేసింది తక్కువ, ఆర్భాటాలు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజధాని గొప్పగా ఉంటే కొరుక్కు తింటామా అంటూ విమర్శించారు. చంద్రబాబు అమరావతిని ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామనడం హాస్యాస్పదమన్నారు. గొప్ప రాజధాని కన్నా, రాష్ట్రంలో ప్రధాన సమస్యలు గుర్తించాలన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని