ఎంఐజీ కల.. నెరవేరేదెలా?
రాజాం మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) వారికి ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ పథకానికి ఆయా వర్గాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం నగరం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ పట్టణాల నుంచి 18,006 మంది ఆసక్తి చూపారు. ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకూ ఇప్పుడు ఇందులో
న్యూస్టుడే- రాజాం మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) వారికి ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ పథకానికి ఆయా వర్గాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం నగరం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ పట్టణాల నుంచి 18,006 మంది ఆసక్తి చూపారు. ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకూ ఇప్పుడు ఇందులో స్థలాలు కేటాయించాలని పీఆర్సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి లేఅవుట్లో 10శాతం ప్లాట్లు వీరికి కేటాయించి స్థలం విలువలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీన్ని మరింతగా విస్తరించి ప్రతి నియోజకవర్గంలో ఒక టౌన్షిప్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
కాశీబుగ్గ: పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని డీ పట్టా భూములివి. ఎంఐజీ గృహాల లేఅవుట్ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ 151 ఎకరాల భూమిని రైతులు ఎంపికచేశారు. పరిహారం విషయంలో అధికారులకు రైతులకు సుదీర్ఘచర్చలు నడిచాయి. అందిస్తున్న పరిహారం చాలదంటూ రైతులు ససేమిరా అన్నారు. చివరికి కలెక్టర్ జోక్యం చేసుకుని పరిహారం విషయంలో నచ్చజెప్పిన మీదట రైతులు ఒకే అన్నారు. ఈ నెల ఏడున అధికారులు సర్వే ప్రారంభించారు. రైతులకు ఇంకా ఈ విషయంలో సందేహాలు ఉండనే ఉన్నాయి. ఇది సర్వే పూర్తయి... రైతులకు పరిహారం చెల్లించేదెప్పుడు.. ప్లాట్లు వేసేదెప్పుడు?
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే..
ఎంఐజీ లేఅవుట్ల కోసం ఇప్పటికే పట్టణాల్లో ఎంతమేర స్థలం అవసరమన్నది ప్రాథమికంగా గుర్తించాం. దీనిపై కసరత్తు జరుగుతోంది. కొన్నిచోట్ల స్థల పరిశీలన గతంలో చేశారు. ప్రతి నియోజకవర్గానికి మున్ముందు జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ పథకాన్ని విస్తరించే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. ఇందుకు అవసరమైన స్థల సేకరణ చేపడతాం. -ఎం.విజయసునీత, జేసీ(రెవెన్యూ), శ్రీకాకుళం
‘వాయిదా’ల్లో చెల్లింపు
ఎంఐజీ లేఅవుట్ల కోసం ఇప్పటికే రాష్ట్రంలో అనంతపురం, గుంటూరు, కడప, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్లాటు విలువలో పదిశాతం దరఖాస్తు సమయంలోనే లబ్ధిదారులు చెల్లించాలి. ఒప్పందం(అగ్రిమెంట్) చేసుకున్న నెలలోపు 30, అర్ధ సంవత్సరం లోపు మరో 30 శాతం కట్టాలి. రిజిస్ట్రేషన్ సమయం, లేదా ఏడాదిలోపు(రెండింటిలో ఏది ముందైతే అది) మిగిలిన 30 శాతం చెల్లించి ప్లాటును సొంతం చేసుకోవచ్ఛు కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా పాట్ల కేటాయింపు చేయాలని నిర్ణయించారు.
స్థల సేకరణే కీలకం
అధికారుల అంచనా ప్రకారం ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల ప్రాప్తికి 1,585.04 ఎకరాల వరకూ స్థలం కావాలని తేల్చారు. లేఅవుట్ మొత్తం స్థలంలో సగం సామాజిక అవసరాలకు కేటాయిస్తారు. వినోద సాధనాలతో పాటు దుకాణాలు, పాఠశాలలు, పార్కులు, క్రీడా మైదానాలు, బ్యాంకులు, సామాజిక భవనాలు ఇలా అవసరమైన అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు వీటిని వినియోగిస్తారు. ప్రధాన రహదారులు 60(బీటీ), అంతర్గత రహదారులు 40 అడుగులు(సీపీ)గా తీర్చిదిద్దుతారు. భూగర్భ డ్రైనేజీ, వరదనీటి కాలువల వ్యవస్థ, తాగునీరు, విద్యుత్తు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు.
ఆచరణ సాధ్యమేనా?
జగనన్న కాలనీలకు పెద్దఎత్తున భూసేకరణ చేశారు. అవన్నీ చాలావరకూ గ్రామీణ ప్రాంతాలు కావడంతో ఎలాగోలా నెట్టుకొచ్చారు. తొలి దశలో ఎంఐజీ లేఅవుట్ల కోసం పట్టణాలకు సమీపంలో 2-5 కిలోమీటర్ల లోపే సేకరించాలి. శ్రీకాకుళం నగరం లబ్ధిదారులకు ఎచ్చెర్ల మండలం జరజాం, పలాస పట్టణం లబ్ధిదారులకు బొడ్డపాడు, రాజాం వారికి గార్రాజుచీపురుపల్లి సమీపంలోని స్థలాలను లోగడ పరిశీలించారు. దరఖాస్తులకు సరిపడా స్థలం ఒక్కచోటే లభ్యం కావడం కష్టతరంగా మారింది.
జిల్లాలో వివరాలిలా...
కేటగిరీ స్థలం విస్తీర్ణం దరఖాస్తులు అవసరమైన స్థలం
(చ.గజాలు) (ఎకరాల్లో)
ఎంఐజీ-1 150 2,458 136.53
ఎంఐజీ-2 200 6,376 531.31
ఎంఐజీ-3 240 9,172 917.20
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..