అతివలకు అండగా181
మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతోనూ నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. చాలా ఘటనల్లో బాధితులు ఎక్కడికి వెళ్లాలో... ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతమవుతున్నారు. అలాంటివారి కోసం మేమున్నామంటోంది వన్స్టాప్ కేంద్రం. 181 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయగానే తక్షణ స్పందన లభిస్తోంది.
బాలికలకు అవగాహన కల్పిస్తున్న వన్స్టాప్ కేంద్రం సిబ్బంది
బలగ(శ్రీకాకుళం), న్యూస్టుడే: మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతోనూ నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. చాలా ఘటనల్లో బాధితులు ఎక్కడికి వెళ్లాలో... ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతమవుతున్నారు. అలాంటివారి కోసం మేమున్నామంటోంది వన్స్టాప్ కేంద్రం. 181 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయగానే తక్షణ స్పందన లభిస్తోంది.
జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో 2015లో వన్స్టాప్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరిని ఆశ్రయించిన వనితలకు ఎలాంటి కష్టమొచ్చినా పూర్తి సహకారం అందిస్తున్నారు. నిరంతరం సేవలందించేందుకు ఇక్కడ ప్రస్తుతం 15 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కౌన్సిలర్, న్యాయవాది, వైద్యులు, సాంకేతిక సిబ్బంది, ఎస్.ఐ., తదితరులు వీరి కోసం అందుబాటులో ఉంటున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు.
అందిస్తున్న సేవలివే...
అత్యాచారం, గృహహింస, చిన్నారులపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణ, వరకట్నం వేధింపులు, బాల్యవివాహాలు వంటి వాటిల్లో బాధితులకు తక్షణ సాయం అందిస్తారు. l వైద్య సదుపాయం కల్పిస్తారు. l ఫిర్యాదుదారు పోలీస్స్టేషన్కు వెళ్లి కేసు పెట్టేందుకు ఓ పోలీసు అధికారిని కేటాయిస్తారు. న్యాయసలహాలతో పాటు అన్ని సహాయక చర్యలు ఉచితంగానే ఇస్తారు. l బాధిత మహిళలకు ప్రత్యేక కౌన్సెలింగ్ అందించి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతారు. l టోల్ఫ్రీ నంబరు 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
ప్రత్యేకంగా కౌన్సిలింగ్...వివిధ సమస్యలపై ఇక్కడికి వచ్చే బాధిత మహిళలకు నిపుణులతో మానసిక, సామాజిక అంశాలపై కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపుతారు. ఓ న్యాయవాది న్యాయ సహాయంతో పాటు తగిన సూచనలందిస్తారు. బాధితురాలి అభీష్టం మేరకు కేసుకి సంబంధించి సలహాలిస్తారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులకు 2019లో 155, 2020లో 19, 2021లో ఇప్పటివరకు 71 చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు.
సహకారం అందిస్తున్నాం... సమాజంలో హింస, దాడులకు గురవుతున్న బాధిత మహిళలకు వన్స్టాప్ కేంద్రం అండగా ఉంటోంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఇక్కడ 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఏ వేళల్లో బాధితులు వచ్చినా అన్ని విధాల సహకారం అందిస్తున్నాం. - వై.హిమబిందు, అడ్మినిస్ట్రేటర్, వన్స్టాప్ కేంద్రం
అయిదేళ్లలో ఇదీ పరిస్థితి..
సంవత్సరం ఫిర్యాదులు
2017 13
2018 44
2019 62
2020 86
2021 53
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.