‘20న కలెక్టరేట్ ముట్టడి’
పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ స్లాబ్ను యథావిధిగా కొనసాగించాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు పి.దాలినాయుడు డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు తెలిపారు.
ప్రసంగిస్తున్న ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు పి.దాలినాయుడు
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ స్లాబ్ను యథావిధిగా కొనసాగించాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు పి.దాలినాయుడు డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రధానోపాధ్యాయుల సంఘ కార్యాలయంలో సోమవారం ఫ్యాప్టో సమావేశం నిర్వహించారు. 11వ పీఆర్సీ ఫిట్మెంట్ను పునఃపరిశీలించాలని, ఐఆర్ను 27 శాతం కంటే తక్కువగా ప్రకటించడం సరికాదన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని డిమాండు చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇవ్వాలన్నారు. సెక్రటరీ జనరల్ కె.అప్పలరాజు, ప్రతినిధులు పి.అప్పారావు, సీహెచ్ రవీంద్ర, ఎస్.కిశోర్కుమార్, వి.నవీన్కుమార్, టి.చలపతిరావు, ఎస్.వి.రమణ, బి.తాతారావు, ఎస్.గోవిందరాజులు, సీహెచ్ రామారావు పాల్గొన్నారు.
30 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్: పీఆర్సీలో 30 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని ఆపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.ఆనందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింగరావు డిమాండు చేశారు. కలెక్టరేట్లో ఇన్ఛార్జి డీఆర్వో సీతారామ్మూర్తికి ఈ మేరకు వినతిపత్రం అందించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.పాపయ్య, జిల్లా కార్యదర్శి జి.మోహనరావు, సీహెచ్.రమణ, పి.గోవిందరావు పాల్గొన్నారు.
‘లోపాలు సవరించండి’
పాతశ్రీకాకుళం, న్యూస్టుడే: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీీఆర్సీ ఫిట్మెంట్ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దానిపై సమీక్షించి లోపాలను సవరించాలని ఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండు చేశారు. ముఖ్యమంత్రి పీఆర్సీ రద్దుపై హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ అంశాన్నే పూర్తిగా పక్కన పెట్టడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఏళ్ల తరబడి ఎన్నో పోరాటాలతో సాధించుకున్న అదనపు సౌకర్యాలను ఏకపక్షంగా తొలగించాలని భావించడం సరికాదన్నారు. దీనిపై ఈ నెల 19న విజయవాడలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)