జీవో ఇచ్చారు..నిధులు మరిచారు!
మూడేళ్ల కిందట తిత్లీ తుపాను సృష్టించిన భీతావహ దృశ్యమిది. సోంపేట మండలం గొల్లగండి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం తోటలో 55 చెట్లు నేలకూలాయి. దీంతో రైతు ఏడాదికి రూ.లక్ష ఆదాయం కోల్పోయాడు. కొత్తగా మొక్కలు పెట్టి అవి కాపునకు వచ్చే సరికి కనీసం మరో ఐదేళ్లు.
న్యూస్టుడే, సోంపేట
మూడేళ్ల కిందట తిత్లీ తుపాను సృష్టించిన భీతావహ దృశ్యమిది. సోంపేట మండలం గొల్లగండి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం తోటలో 55 చెట్లు నేలకూలాయి. దీంతో రైతు ఏడాదికి రూ.లక్ష ఆదాయం కోల్పోయాడు. కొత్తగా మొక్కలు పెట్టి అవి కాపునకు వచ్చే సరికి కనీసం మరో ఐదేళ్లు. ఇంతా నష్టపోతున్న రైతుకు పరిహారంగా వచ్చింది రూ.82,500. కనీసం అంతే మొత్తం అదనంగా చెల్లిస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం హామీ అమల్లోకి వస్తే మరికొంత ఆసరా అయినా లభించేది. రెండేళ్లు దాటినా దానికి అతీగతీలేదు. నాయకుల మాటలు తప్ప బాధిత రైతుకు ఒరిగిందేమీ లేదు.
తాను అధికారంలోకి వస్తే తిత్లీ బాధిత రైతులకు అదనపు పరిహారం ఇస్తానని ఇప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. మాట ప్రకారం కొబ్బరి, జీడి రైతులకు రెట్టింపు పరిహారం ఇచ్చేలా జీవో జారీ చేశారు. నిధులు మాత్రం సరిపడినంతా విడుదల చేయలేదు.
ఇచ్చింది రూ.98 కోట్లే...
సెప్టెంబరు 2019న విడుదల చేసి జీవోనెంబర్ 11 ప్రకారం కొబ్బరి చెట్టుకి రూ.1,500, జీడిపంటకు హెక్టారుకి రూ.20 వేలు అదనంగా పరిహారం అందజేయాల్సి ఉంది. ఇందుకు రూ.278 కోట్లు అవసరమని లెక్కలు వేశారు. ఇందులో కేవలం రూ.98 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చిన నిధులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలో తెలియక, పైనుంచి ఎలాంటి ఆదేశాలూ లేక అధికారులు మిన్నకుండిపోయారు.
తుడిచిపెట్టుకుపోయిన ఉపాధి
2018 అక్టోబరు నెలలో సంభవించిన తిత్లీ తుపాన్లో ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, సంతబొమ్మాళి మండలాల పరిధిలో కొబ్బరి, జీడితోటలు తుడిచి పెట్టుకుపోయాయి. వందేళ్ల కాలంలో వచ్చిన అతిపెద్ద తుపాన్ కావడంతో ఈ ప్రాంతాల్లోని ప్రతిరైతూ బాధితుడిగా మారాడు. కొబ్బరి, జీడి పంట ఆధారంగానే ఉద్దానంలో 1.5 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రెండు ప్రధాన పంటలు నాశనం కావడంతో ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో సాంకేతిక ఇబ్బందులు, మొదటి దఫా పరిహారమే అందనివారు 5 వేల మందికి పైగా ఉన్నారు.
ఇవీ లెక్కలు
తిత్లీలో పడిపోయిన కొబ్బరి చెట్లు 16 లక్షలకు పైగా
నష్టపోయిన జీడిచెట్లు 29 లక్షలు
బాధిత రైతు కుటుంబాలు 53 వేలు
బాధిత రైతు కుటుంబాలు 79 వేలు
కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపాం...
- రత్నాల వరప్రసాద్, ఏడీ, ఉద్యాన శాఖ
పెంచిన పరిహారం మేరకు అదనపు నిధుల కోసం కలెక్టర్ ద్వారా ఇటీవలే మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. గతంలో విడుదల చేసిన నిధులు తక్కువ కావడం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో పంపిణీ చేయలేకపోయాం. ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిన తరువాత అదనపు సాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం.
త్వరలో పంపిణీ జరిగేలా కృషి...
- పిరియా విజయసాయిరాజ్, ఛైర్పర్సన్, జిల్లాపరిషత్తు
తిత్లీ అదనపు పరిహారం త్వరలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో దారిమళ్లిన సాయం, అనర్హుల ఖాతాలో నిధులు జమ చేయడం లాంటి అంశాల మూలంగా అదనపు సాయం పంపిణీ ఆలస్యమైంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అర్హులైన బాధిత రైతులందరికీ పరిహారం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట