కాలం చేసిన గాయం!
సరదాగా పండగ చేసుకున్న ఇళ్లలో ఆ సందడి ఆవిరైపోయింది. ఊహించని ప్రమాదాలు ఆ కుటుంబసభ్యులను శోక సంద్రంలో ముంచేశాయి. సోమవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు, రైలు ఢీకొని ఒకరు... చెరువులో జారిపడి ఒకరు.. నదిలో మునిగి మరొకరు మృత్యువాత పడ్డారు.
సరదాగా పండగ చేసుకున్న ఇళ్లలో ఆ సందడి ఆవిరైపోయింది. ఊహించని ప్రమాదాలు ఆ కుటుంబసభ్యులను శోక సంద్రంలో ముంచేశాయి. సోమవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు, రైలు ఢీకొని ఒకరు... చెరువులో జారిపడి ఒకరు.. నదిలో మునిగి మరొకరు మృత్యువాత పడ్డారు. నాగావళి నదిలో ఇటీవల గల్లంతైన ఇద్దరూ మృతిచెందారు. వీటితో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా...
భామిని గ్రామీణం, హిరమండలం, న్యూస్టుడే: సంక్రాంతికి అత్తారింటికి వెళ్లి సరదాగా గడిపిన అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న వ్యక్తిని మృత్యువు కాటేసింది. బత్తిలి హెచ్సీ ఎ.వి.రమణ వివరాల ప్రకారం.. హిరమండలానికి చెందిన కుమారస్వామి(35) సోమవారం ఉదయం బత్తిలిలోని అత్తారింటి వద్ద నుంచి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నాడు. భామిని మండలం కాట్రగడ-బి-బొమ్మికకు మధ్యన ప్రధాన అలికాం-బత్తిలి రహదారిలోని మలుపు వద్ద ఏర్పాటు చేసిన సేఫ్టీ గ్రిల్స్ను ఢీకొన్నాడు. దీంతో వాహనం పొలాల్లోకి వెళ్లిపోగా అతని పొట్ట, ఇతర భాగాల్లోకి గ్రిల్స్ చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొత్తూరు సీఐ ఎస్.సూర్యచంద్రమౌళి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ప్రమాదంలో దుర్మరణం..
ఇచ్ఛాపురం, కవిటిగ్రామీణం, న్యూస్టుడే: ఇచ్ఛాపురం-జాడిపూడి రైలు నిలయాల మధ్య రైౖలు ఢీకొనడంతో కవిటి మండలంలోని జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణారావు(34) మృతి చెందారు. రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూలీగా పని చేస్తూ, భార్యాబిడ్డలను పోషించుకుంటున్న కృష్ణారావు ఆదివారం ఇంట్లో పండగ చేసుకొని, బంధుమిత్రులతో సరదాగా గడిపారు. అదేరోజు రాత్రి బహిర్భూమికని రైలు పట్టాలు దాటి వెళ్తుండగా ఎగువమార్గంలో నుంచి వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పలాస రైల్వే పోలీసు హెచ్సీ రమేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, శవపంచనామాకు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని...
శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: రహదారి ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు వద్ద సోమవారం జరిగింది. ఎస్.ఐ. రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం. పెద్దపాడు గాంధీనగర్కాలనీ జాడపేటకు చెందిన జాడ రాంబాబు(38) విశాఖపట్నంలో తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి సొంతూరుకు వచ్చాడు. పండగ జరుపుకొన్నాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దపాడు వద్ద బహిర్భూమికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా నరసన్నపేట నుంచి విశాఖపట్నంవైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిత్తారపురం వద్ద ఒకరు...
సంతకవిటి, బూర్జ, న్యూస్టుడే: నాగావళి నదిలో ఈ నెల 14న గల్లంతైన బి.భాస్కరరావు(45) మృతదేహం సంతకవిటి మండలం చిత్తారపురం గ్రామం వద్ద లభ్యమైనట్లు ఎస్ఐ ఆర్.జనార్దనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండల కేంద్రానికి చెందిన భాస్కరరావు ఖండ్యాంలో కూరగాయలు అమ్మేందుకు సైకిల్పై నాగావళి నది దాటుతుండగా ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.
నదిలో గల్లంతైన యువకుడి మృతి
ఆమదాలవలస గ్రామీణం, న్యూస్టుడే: ఆమదాలవలస మండలంలోని బెలమాం వద్ద నాగావళి నదిలో గల్లంతైన అనీల్కుమార్(21) మృతదేహం సోమవారం శ్రీకాకుళం నగరంలోని దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద లభ్యమైంది. అక్కడ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలపగా... వారొచ్చి మృతుడిని గుర్తించారు. ఈ మేరకు కేసును నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆమదాలవలస పోలీసులు తెలిపారు. అనీల్కుమార్ విశాఖపట్నంలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్నాడు. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. పండగకు బెలమాంలోని తాతగారింటికి వచ్చి నదిలో ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే.
చెరువులో జారిపడి...
సారవకోట, న్యూస్టుడే: చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సారవకోట మండలంలోని భద్రాచలం గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. ఎస్.ఐ. లావణ్య వివరాల మేరకు... శ్రీకాకుళం న్యూకాలనీకి చెందిన బోగి భరణికుమార్(38) ఈ నెల 15న సంక్రాంతికి అత్తవారింటికి భద్రాచలం గ్రామానికి భార్యాపిల్లలతో కలిసి వచ్చారు. ఈ నెల 16న చెరువులో స్నానానికి వెళ్లాడు. చీకటి పడినా ఇంటికిరాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. భరణికుమార్కు ఈత రాదని తెలుసుకొని గ్రామంలోని చెరువు వద్ద పరిశీలించారు. అక్కడ గట్టున పాదరక్షలు, బట్టలు కనిపించడంతో గ్రామస్థులు చెరువులో దిగి గాలించగా నీటిలో మృతదేహం లభ్యమైంది. భరణికుమార్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అదృశ్యమై... శవమై తేలి..
ఎచ్చెర్ల/అరసవల్లి, న్యూస్టుడే: ఎచ్చెర్ల మండలం తెప్పరేవు గ్రామ సమీపంలో శనివారం అదృశ్యమైన ఎక్సైజ్ కానిస్టేబుల్ షేక్ అన్వర్(35) సోమవారం కాళింగపేట వద్ద నాగావళి నదీ తీరంలో శవమై తేలాడు.ఎస్ఐ కె.రాము తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం వాంబేకాలనీలో నివాసం ఉంటున్న అన్వర్ శనివారం నది వద్దకు బహిర్భూమికి వెళ్లి అందులో జారి పడిపోయాడు. ఇంటికి రాకపోవడంతో భార్య రహీనాద్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన మృతదేహం కాళింగపేట వద్ద కనిపించింది. మృతుడి తలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అన్వర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు
[ 23-04-2024]
ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. -
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి.. చెల్లికి అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్: చంద్రబాబు
[ 23-04-2024]
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా.. అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
ఇదేనా జగన్.. మీరు చెప్పిన ఊళ్లు..
[ 23-04-2024]
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. -
నాలుగో రోజు.. నామినేషన్ల హోరు..!
[ 23-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు ఊపందుకుంది. సోమవారం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఇతరులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. -
పాతపట్నం, ఆమదాలవలసలో ప్రజాగళం
[ 23-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది మాదిరిగానే జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. -
పలాసలో చుక్కలు చూపిన వైకాపా ర్యాలీ
[ 23-04-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు నామినేషన్ సందర్భంగా ప్రచార ఆర్భాటానికి చేపట్టిన ర్యాలీతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల వాసులు విలవిలలాడారు. -
కూలేందుకు సిద్ధంగా ఉన్నా.. కళ్లకు గంతలే..!
[ 23-04-2024]
రాష్ట్రంలో తీర ప్రాంతానికి ముఖద్వారంగా పేర్కొనే ఇచ్ఛాపురం మండలం డొంకూరు వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. -
కాలనీలు కాదు.. జగనన్న కహానీలు
[ 23-04-2024]
మేము కట్టేది కాలనీలు కాదు ఊళ్లు అని సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ సభల్లో గొప్పలు చెప్పారు. అయిదేళ్లలో చాలమంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. -
నేడు ఎచ్చెర్లకు బస్సు యాత్ర
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు. -
కట్టుకున్నోడిని వదిలేసి.. కపట మాటలు నమ్మేసి
[ 23-04-2024]
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భర్తకు విడాకులిచ్చి రాగా.. మాటిచ్చిన వ్యక్తి మోసం చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. -
77 మందికి షోకాజ్ నోటీసులు
[ 23-04-2024]
ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మందికి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్