logo

ఉత్సాహంగా రంగస్థల పోటీలు

మండలంలోని సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ సామాజిక భవనంలో శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు కళాపీఠం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం పౌరాణిక, పద్య నాటక రంగస్థల పోటీలు జరిగాయి. ఇందులో శ్రీకాకుళం

Published : 22 Jan 2022 04:52 IST


విజేతలకు ప్రశంసాపత్రం అందిస్తున్న నటుడు జబర్దస్త్‌ అప్పారావు, తదితరులు

హిరమండలం, న్యూస్‌టుడే: మండలంలోని సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ సామాజిక భవనంలో శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు కళాపీఠం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం పౌరాణిక, పద్య నాటక రంగస్థల పోటీలు జరిగాయి. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చమగోదావరి, ఒంగోలు జిల్లాలకు చెందిన 57 మంది కళాకారులు తమ ప్రదర్శన ఇచ్చారు. న్యాయనిర్ణేతలు విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి పురుషోత్తపురానికి చెందిన బి.శ్రీరామచంద్రశర్మ, ద్వితీయ బహుమతి పాలకొండకు చెందిన పుట్టా కృష్ణ, తృతీయ బహుమతి పురుషోత్తపురానికి చెందిన డీవీఎస్‌ గోపాలరావు దక్కించుకొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు జబర్దస్త్‌ అప్పారావు, జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు, సర్పంచి లంక రోజారాణి, కళాపీఠం అధ్యక్షుడు ఎ.లింగమూర్తి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని