కుమారుడి పాణం తీసిన తల్లిదండ్రుల గొడవ
చరవాణిలో మాట్లాడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి తీరని శోకాన్నే మిగిల్చింది. మరో ఘటనలో తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండటం తట్టుకోలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడటం
చరవాణిలో మాట్లాడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి తీరని శోకాన్నే మిగిల్చింది. మరో ఘటనలో తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండటం తట్టుకోలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడటం ఆలోచనల్లో పడేస్తోంది. జిల్లాలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు మనం ఎటుపోతున్నామో.. ఓసారి ప్రశ్నించుకోమంటున్నాయి..
దుర్గాప్రసాద్(దాచిన చిత్రం)
లావేరు గ్రామీణం, న్యూస్టుడే: తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుండటాన్ని తట్టుకోలేక దుర్గాప్రసాద్(24) బలవన్మరణానికి పాల్పడిన ఘటన లావేరు మండలం తాళ్లవలస పంచాయతీ రావివలసలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నారాయణ అప్పారావు భార్యతో ఈ నెల 19న గొడవ పడ్డాడు. తరచూ గొడవపడుతున్న వీరి తీరు చూడలేక పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్ ఆ రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన తండ్రి కూడా తాగేశాడు. స్థానికులు ఇద్దరినీ 108లో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. తండ్రి కొలుకోగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గురువారం కేజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దుర్గాప్రసాద్ భద్రాచలంలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. సంక్రాంతి పండక్కి వచ్చాడు. అప్పారావు చిన్న కుమారుడు దివ్యాంగుడు. తల్లి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.సిద్ధార్థ్కుమార్ తెలిపారు.
చరవాణిలో మాట్లాడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య
వంగర, న్యూస్టుడే: చరవాణికి దూరంగా ఉంటూ చదువుపై దృష్టిపెట్టాలని తల్లిదండ్రులు చెప్పిన మాటలకు ఆవేశం తెచ్చుకుని వంగర మండలం కె.కొత్తవలస గ్రామానికి చెందిన బాలిక(16) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అప్పలరాజు కుటుంబం కొన్నేళ్ల కిందట కూలిపనుల నిమిత్తం విజయవాడ వలస వెళ్లింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె ప్రస్తుతం అక్కడే పదోతరగతి చదువుతోంది. ఇటీవల అంతా సంక్రాంతి పండక్కి స్వగ్రామం వచ్చారు. బాలిక సెల్ఫోన్లో తరచూ మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు శుక్రవారం మందలించారు. దీంతో బాలిక మధ్యాహ్నం 2 గంటల సమయంలో మడ్డువలస వంతెన పైనుంచి సువర్ణముఖి నదిలో దూకేసింది. విషయం తెలుసుకున్న సీఐ నవీన్కుమార్, ఎస్ఐ దేవానంద్ సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో గాలించగా.. బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు శ్రీనివాసరావు ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!