ఆ స్థాయిలో పరీక్షలేవి?
సిక్కోలులో కొవిడ్ మూడోదశ విజృంభణ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకొస్తున్నాయి. గతంలో పాజిటివిటీ రేటు 7 దాటిన వెంటనే కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. శుక్రవారం వచ్చిన కొవిడ్
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, గుజరాతీపేట
* జిల్లాలో శుక్రవారం 3,279 నమూనాలు పరీక్షించగా రికార్డు స్థాయిలో 1,230 కొత్త కొవిడ్ కేసులు వెలుగులోకొచ్చాయి. పాజిటివిటీ రేటు 37.5 శాతంగా నమోదైంది. గత ఎనిమిది నెలల్లో ఇదే అత్యధికం. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా కొవిడ్ పరీక్షలు మాత్రం పెంచడం లేదు.
* గతేడాది కొవిడ్ రెండో దశలో విజృంభించినప్పుడు మే 1న అత్యధికంగా 2,048 కేసులు నమోదయ్యాయి. అప్పుడు 7,215 నమూనాలు పరీక్షించారు. అంటే పాజిటివిటీ రేటు 28.38 శాతం. అప్పుడు ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. ఇప్పుడు పది రోజుల్లోనే పాజిటివిటీ రేటు 7.5 నుంచి 37.5కి చేరుకుంది.
సిక్కోలులో కొవిడ్ మూడోదశ విజృంభణ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకొస్తున్నాయి. గతంలో పాజిటివిటీ రేటు 7 దాటిన వెంటనే కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. శుక్రవారం వచ్చిన కొవిడ్ ఫలితాల ప్రకారం పాజిటివిటీ రేటు అత్యంత ప్రమాదకరస్థాయిలో 37.5గా నమోదైంది. అయినా జిల్లా అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలకు దిగడం లేదు.
కొవిడ్ కిట్ల కొరత..!
గతంలో జిల్లాకి లక్ష కొవిడ్ టెస్టింగ్ కిట్లు సరఫరా అయ్యాయి. వాటిలో ప్రస్తుతం 30 వేలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పరీక్షల సంఖ్య పెంచడంతో కిట్ల కొరత ఏర్పడింది. జిల్లాలో ఆ సమస్య ఎదురు కాకుండా అధికారులు పరీక్షలను పెంచడం లేదు. పీహెచ్సీ స్థాయిలో గతంలో ఎంతమంది వెళ్లినా నమూనాలు సేకరించేవారు. ఇప్పుడు 10-15 మందికి మాత్రమే చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే భేదం లేకుండా వైరస్ అంతటా వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో గ్రామాల్లోనూ ఎక్కువ సంఖ్యలో నమూనాలు సేకరించి పరీక్షించాలి. వీలైనంత ఎక్కువ మంది వైరస్ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తేనే వారి నుంచి ఇతరులకు కొవిడ్ వ్యాపించకుండా కట్టడి చేయవచ్చు.
ఆంక్షలు ఏమయ్యాయో..
మాస్కు ధరించకుండా ఎవరైనా బయట తిరుగుతూ కనిపిస్తే రూ.100 జరిమానా విధిస్తామని గతంలో జిల్లా అధికారులు చెప్పారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్, బస్సుల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పారు. ఆ హెచ్చరికలన్నీ ప్రకటనలకే పరిమితమైపోయాయి తప్పితే పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్నిచోట్లా నిబంధనలు కఠినంగా అమలు చేస్తేనే కొవిడ్ వ్యాప్తిని కొంతలో కొంతైనా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది.
విస్తృతంగా నిర్వహించండి: కలెక్టర్
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్
టెక్కలి పట్టణం, న్యూస్టుడే: కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అధికారులకు సూచించారు. టెక్కలిలోని జిల్లా ఆసుపత్రి నూతన భవనంలో ఏర్పాటు చేసిన వీఆర్డీల్యాబ్ను శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం 100 ఆర్టీపీసీఆర్ టెస్టులతో ట్రయల్రన్ ప్రారంభమైనట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో 5 వేల పరీక్షల సామర్థ్యంతో ల్యాబ్ నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి టెక్కలిలో పరీక్షల సామర్థ్యాన్ని 3 వేలకు పెంచుతామన్నారు. ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం మండలాల నుంచి వచ్చే నమూనాలను కేవలం 12 గంటల్లోనే పరీక్షించి ఫలితాలిచ్చే సౌకర్యం కలిగిందన్నారు. వైద్యసిబ్బంది నియామకం, పరీక్షల సామర్థ్యం వివరాలను డిప్యూటీ డీఎంహెచ్వోలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26న ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మౌలిక వసతులు, తాగునీరు అంశాలపై ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ప్రసాద్ను ఆరా తీశారు. ఈయనవెంట సబ్కలెక్టర్ వికాస్మర్మత్, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ శ్రీనుబాబు, తహసీల్దార్ హనుమంతరావు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.