కొండను కొల్లగొడుతున్నారు!
కోటబొమ్మాళి సమీపంలో వందకుపైగా ఎకరాల్లో విస్తరించిన కొత్తపేట కొండ ఇది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ.. పలు జీవజాలాలకు ఆధారంగా నిలుస్తున్న ఈ కొండను గడిచిన మూడు నెలలుగా ఇలా తవ్వి తరలించేస్తున్నారు.
న్యూస్టుడే, కొత్తపేట(కోటబొమ్మాళి)
కోటబొమ్మాళి సమీపంలో వందకుపైగా ఎకరాల్లో విస్తరించిన కొత్తపేట కొండ ఇది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ.. పలు జీవజాలాలకు ఆధారంగా నిలుస్తున్న ఈ కొండను గడిచిన మూడు నెలలుగా ఇలా తవ్వి తరలించేస్తున్నారు. గతంలో అధికారులుండరని ఆదివారం, సెలవు రోజుల్లో మాత్రమే ఈ అక్రమం సాగేది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జేసీబీ పెట్టి మరీ రోజుకు 30కిపైగా ట్రాక్టర్ల కంకరను తవ్వి తరలించేస్తున్నారు. దీంతో కొండ వేగంగా కరిగిపోతోంది.
కొత్తపేట, కోటబొమ్మాళి సమీపంలో ఉన్న కొండలో కంకర అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. యంత్రాలతో భారీగా తవ్వుతూ ట్రాక్టర్లతో బహిరంగంగా తరలించి విక్రయిస్తున్నారు. ఈ అక్రమం మండల, ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోనే జరుగుతున్నా.. ఎలాంటి చర్యలూ లేకపోవడం విడ్డూరం. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ పనులకే తవ్వుతున్నామని అక్రమార్కులు బెదరగొడుతున్నారు.
ముప్పు ముంగిట..
కొండను ఆనుకుని కేజీబీవీ బాలికల కళాశాల, కొండపై పోలీసు, రెవెన్యూ రిపీటర్స్టేషన్లు, ప్రకాష్నగర్కాలనీ, ఇందిరమ్మకాలనీ ఉన్నాయి. తాజాగా కోటబొమ్మాళి, కొత్తపేట పంచాయతీలకు చెందిన వందలాది మందికి జగనన్న కాలనీ నివాసాలు ఈ సమీపంలోనే మంజూరయ్యాయి. ఓ వైపు వీటి నిర్మాణాలు సాగుతున్నాయి. మరోవైపు భారీగా ఈ కంకర అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇలా తవ్వేస్తే కొండ ఆకారం మారిపోయి.. భవిష్యత్తులో వరద ముంపు పొంచి ఉంటుందని సమీప ప్రాంతాల వారు అంటున్నారు. తవ్వకాలతో కొండ మట్టి వదులు అవుతోంది. దీంతో వర్షం పడితే మట్టి సులువుగా కరిగి చుట్టుపక్కల జనావాసాలు, కార్యాలయాల్లోకి చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉందని, వెంటనే అక్రమ తవ్వకాలను ఆపాలని వీరంతా కోరుతున్నారు.
అనుమతులు తీసుకోవాలి..
కంకర తవ్వకాలకు ఎక్కడా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైనప్పుడు దరఖాస్తులు సమర్పిస్తే మైన్స్, జియాలజీ శాఖకు పంపించటం జరుగుతుంది. ఈ విషయమై పలువురు తెలియచేసినప్పుడు దరఖాస్తులు ఇవ్వాలని చెప్పడం జరిగింది.
- సూర్యనారాయణ, తహసీల్దార్, కోటబొమ్మాళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?