42 కిలోమీటర్లు.. నానాకష్టాలు
బూర్జ మండలం రామన్నపేట వద్ద పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారి దుస్థితి ఇది. నిత్యం ఈ దారిలో అయిదు వేల వాహనాలు తిరుగుతుంటాయి. 30 నుంచి 40 వేల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. 42 కిలోమీటర్ల రహదారి మొత్తం ఇలా గుంతలమయమై వాహనదారులకు నరకం చూపిస్తోంది.
బూర్జ మండలం రామన్నపేట వద్ద పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారి దుస్థితి ఇది. నిత్యం ఈ దారిలో అయిదు వేల వాహనాలు తిరుగుతుంటాయి. 30 నుంచి 40 వేల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. 42 కిలోమీటర్ల రహదారి మొత్తం ఇలా గుంతలమయమై వాహనదారులకు నరకం చూపిస్తోంది.
పాలకొండ, గ్రామీణం, బూర్జ, న్యూస్టుడే
జిల్లా కేంద్రం కావడం, ఆమదాలవలసలో రైలు నిలయం ఉండడంతో ఈ రహదారి అత్యంత ప్రధానమైంది. బూర్జ, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, రేగిడి, ఆమదాలవలస తదితర మండలాలకు చెందిన వారంతా ఇదే మార్గంలో ప్రయాణం చేయాల్సిందే. నిత్యం జిల్లా కేంద్రం నుంచి ఇతర మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి ఉద్యోగులూ ఈ రహదారిలోనే ప్రయాణించాలి. ఇక జిల్లా కేంద్రం నుంచి ఒడిశా రాష్ట్రానికి వెళ్లే ప్రధాన మార్గమూ ఇదే. సీఎస్పీ రహదారిగా ఉన్న అంతర్రాష్ట్ర రహదారిగానూ ఈ మార్గం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆద్యంతమూ దడే!..
పాలకొండ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు 42 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. ఈ మార్గం మొత్తం రహదారి పూర్తిగా పాడైంది. పలు చోట్ల గుంతలు ఉండగా, మరికొన్నిచోట్ల రహదారి ఛిద్రమవ్వగా ఇంకొన్ని చోట్ల తారులేచిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే దడపుట్టిస్తోంది. కనుచూపుమేర రహదారి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా అంతలోనే గుంతలు ఎదురవుతున్నాయి. బస్సులు ఇతర వాహనాలు అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరుకోలేని పరిస్థితి. ఇక ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తే ఒళ్లుహూనమే. గంట సమయంలో చేరాల్సింది ప్రయాణానికి మరింత సమయం పడుతోంది.
కనీస మరమ్మతులు లేవు..
గతంలో ఈ రహదారిలో తరచూ మరమ్మతులు చేసేవారు. గత రెండేళ్లుగా అలాంటివేమీ జరగడంలేదు. దీనికితోడు వరుస వర్షాలు కారణంగా రహదారి మొత్తం దెబ్బతింది. అధికారులు చర్యలు తీసుకుని రహదారి బాగు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
పనులు ప్రారంభించనున్నాం
ఆమదాలవలస నుంచి శ్రీకాకుళంలో డే అండ్ నైట్ కూడలి వరకు రెండు వరసల రహదారి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నాం. అదేవిధంగా పాలకొండ నుంచి ఆమదాలవలస వరకు మరమ్మతులు చేసేందుకు ఇప్పటికే టెండర్లకు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. దీని కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయి.
- జాన్ విక్లిప్, డీఈ,రహదారులు భవనాల శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్