పెళ్లిపీటలపైకి పసిమొగ్గలు!
‘ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికకు చదువంటే ఆసక్తి. మరో ప్రాంతంలో ఉండి చదువుకునేది. కొవిడ్ నేపథ్యంలో ఇటీవల సొంతూరుకు రావడంతో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు కన్నవారు. అధికారులకు సమాచారం అందటంతో బాలల రక్షణ విభాగం, ఐసీడీఎస్, పోలీసు అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లిని అడ్డుకుని బాలికను ప్రభుత్వ విద్యా సంస్థలో చేర్పించటంతో ఇప్పుడు చదువుకుంటోంది’...
నేడు జాతీయ బాలికా దినోత్సవం
న్యూస్టుడే - రాజాం
బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
‘ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికకు చదువంటే ఆసక్తి. మరో ప్రాంతంలో ఉండి చదువుకునేది. కొవిడ్ నేపథ్యంలో ఇటీవల సొంతూరుకు రావడంతో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు కన్నవారు. అధికారులకు సమాచారం అందటంతో బాలల రక్షణ విభాగం, ఐసీడీఎస్, పోలీసు అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లిని అడ్డుకుని బాలికను ప్రభుత్వ విద్యా సంస్థలో చేర్పించటంతో ఇప్పుడు చదువుకుంటోంది’
‘లావేరు మండలానికి చెందిన ఓ కుటుంబం పేదరికంతో పొట్టకూటి కోసం మరో చోటకు వలసవెళ్లింది. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి సొంతూరు వచ్చారు. మంచి సంబంధం రావడంతో కన్నవారు సరేనని బాలికకు పెళ్లి చేసేందుకు ముహూర్తం పెట్టించేశారు. అధికారులకు తెలిసింది. కన్నవారు, బంధువులు మొదట ప్రతిఘటించారు. వారికి చట్టాలు, పరిణామాలను వివరించి అధికారులు దారికి తెచ్చారు. బాలికను ప్రభుత్వ విద్యాలయంలో చేర్పించడంతో ప్రస్తుతం పైతరగతులు చదువుతోంది’.
సగటున జిల్లాలో ప్రతి నాలుగు రోజులకో బాల్యవివాహం అధికారుల దృష్టికొస్తోంది. ఇలా వచ్చిన వాటిని అడ్డుకుంటున్నా... రాకుండానే ఎన్ని పెళ్లిళ్లు జరిగిపోతున్నాయో.. వీటిని అడ్డుకునేందుకు ఎన్నెన్నో చట్టాలు తెస్తున్నా.. ఆ మేరకు ప్రజలను చైతన్యపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు.. అందుకు నిదర్శనాలే ఇంకా బాల్యవివాహాలు కొనసాగుతుండటం.. మరోవైపు కేంద్రప్రభుత్వం యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21కు పెంచాలని యోచిస్తోంది.
ఎందుకు ఈ వివక్ష
* మగపిల్లాడిని ఒకలా, ఆడపిల్లను మరోలా చూసే దృక్పథం మారాలంటున్నారు మానసిక నిపుణులు. 2011-2016 సంవత్సరాల మధ్య 395 ఫిర్యాదులు అధికారులకు అందితే 392 పెళ్లిళ్లు నిలుపుదల చేశారు. ఇందులో 383 మంది బాలికలే కావడం నిర్ఘాంతపరిచే నిజం.
* 2016-2021 మధ్య 671 ఫిర్యాదులు రాగా 666 పెళ్లిళ్లు నిలిపేశారు. ఇందులో 663 ఉదంతాల్లో బాలికలే కావడం విశేషం.
ఇవీ కారణాలు..
* తక్కువ కట్నం, కట్నం లేకుండా వియ్యంకులు అంగీకరించారని..
* కన్నవారి బాధ్యత తీరుతుందని..
* మంచి సంబంధం వచ్చిందని..
* తల్లిదండ్రుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారని..
* గ్రామాల్లో రాజకీయ పలుకుబడి పెంచుకోవాలని..
* మ వివాహాల వైపు మొగ్గు చూపుతారేమోననే భయం.. ఇలా పలు విషయాలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి.
దీర్ఘకాలిక సమస్యలు..
- జి.మాధవీలత, ప్రసూతి వైద్య నిపుణులు, జీఎంఆర్ కేర్
బాల్యంలోనే గర్భం దాల్చటం వల్ల శారీరక ఎదుగుదల నిలిచిపోతుంది. గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు సహజ ప్రసవానికి ఇబ్బంది కలుగుతుంది. మాతా శిశుమరణాలకు ఆస్కారం ఉంటుంది. శిశువు ఐక్యూ, పెరుగుదలపైనా ప్రభావం ఉంటుంది. అంగవైకల్య ఇబ్బందులూ తలెత్తుతాయి.
బాధ్యత అందరిదీ..
-కేవీ రమణ, జిల్లా బాలల రక్షణ అధికారి, శ్రీకాకుళం
బాల్య వివాహాలను అడ్డుకోవడంలో గ్రామస్థాయి అధికారులు కీలక భూమిక పోషించాలి. పెళ్లిళ్లు చేసేందుకు కన్నవారు ప్రయత్నిస్తే బాల బాలికలు అధికారులకు సమాచారం ఇచ్చి రక్షణ పొందాలి. గ్రామస్థాయిలో బాలల రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా