‘పాత విధానంలోనే జీతాలివ్వండి చాలు’
సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారమని ప్రభుత్వం చెబుతున్న కొత్త పీఆర్సీ వద్దని, పాత విధానంలోనే జీతాలిస్తే సరిపోతుందని ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం
సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు
పాతశ్రీకాకుళం, న్యూస్టుడే: సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారమని ప్రభుత్వం చెబుతున్న కొత్త పీఆర్సీ వద్దని, పాత విధానంలోనే జీతాలిస్తే సరిపోతుందని ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో ఆదివారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త పీఆర్సీతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందనే ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలన్నారు. గతంలో హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, తదితర డిమాండ్లను మాత్రం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల ఆరు వరకు వివిధ దశల్లో ఆందోళనలు కొనసాగించనున్నామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 7 నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కె.శ్రీరాములు, ఐ.నాగరాజు, కె.భానుమూర్తి, టి.బలరాం, కె.శ్రీనివాసరావు, టి.చలపతిరావు, పి.అప్పారావు, కె.రాజేశ్వరరావు, బి.వెంకటేశ్వరరావు, బి.కృష్ణమూర్తి, పి.వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.