ఇంటింటా కొళాయి.. అంతా రూర్బన్ బడాయి
అబ్బా.. ఇంటింటా కొళాయి.. సోంపేట వాసులకు ఎంత హాయి.. అనుకోకండి.. ఏర్పాటు చేసి రెండేళ్లు దాటినా ఈ కొళాయిల్లో నీరు మాత్రం రావడంలేదు. రూర్బన్ పథకం కింద జిల్లాలో ఏకైక క్లస్టర్గా సోంపేట మేజర్ పంచాయతీని ఎంపిక చేశారు.
న్యూస్టుడే, సోంపేట
అబ్బా.. ఇంటింటా కొళాయి.. సోంపేట వాసులకు ఎంత హాయి.. అనుకోకండి.. ఏర్పాటు చేసి రెండేళ్లు దాటినా ఈ కొళాయిల్లో నీరు మాత్రం రావడంలేదు. రూర్బన్ పథకం కింద జిల్లాలో ఏకైక క్లస్టర్గా సోంపేట మేజర్ పంచాయతీని ఎంపిక చేశారు. మూడేళ్ల కిందట ఉద్దానం ప్రాజెక్టు నీటిలభ్యత ఆధారంగా రూ.4 కోట్ల నిధులతో జలంత్రసోంపేట వీధుల్లో 3 ట్యాంకులు, ఇంటింటా కొళాయిలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. రెండేళ్లవుతున్నా నీటి సరఫరా మాత్రం లేదు. అవసరమైన మేరకు నీటి లభ్యత లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలాయి.
నీటి లభ్యత పూర్యాపరాలను పరిశీలించకుండా పనులు చేయడంతోనే ఇవి వృథాగా ఉండిపోయాయి. రూ.4 కోట్లు వెచ్చించినా పట్టణ వాసుల నీటి కష్టాలు మాత్రం తీరలేదు. నిర్మించిందే వృథాగా ఉంటే.. అధికారులు మాత్రం చీకటి సోంపేట వైపు రూ.2 కోట్లతో ట్యాంకులు, కొళాయిల నిర్మాణ పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. నిర్మించిన వాటికే అతీగతీ లేకుండా పడి ఉండగా రెండోవైపు పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండటం.. నిజంగా పట్టణ ప్రజల నీటి సమస్య తీర్చడానికేనా.. అనే విమర్శలు స్థానికుల నుంచి విన్పిస్తున్నాయి. మెగా పథకంలో తాగునీరొస్తుంది కదా.. అప్పుడిచ్చే దానికైనా పనికొస్తాయిలే అంటుండటం విడ్డూరం కాక మరేమిటి.
మెగా తాగునీటి పథకం వస్తేనే...
- తిరుపతినాయుడు, డీఈఈ, గ్రామీణ నీటిసరఫరా విభాగం
ఉద్దానం మంచినీటి పథకం ఆధారంగా సోంపేట పట్టణానికి ఇంటింటా కొళాయిల ద్వారా నీటి సరఫరా చేయాలని భావించాం. మహేంద్రతనయలో ఆ మేరకు నీటిలభ్యత లేకపోవడంతో పట్టణానికి రోజుకి గంట కూడా ఇంటింటా కొళాయిల ద్వారా నీటిసరఫరా చేసేందుకు అవకాశాలు లేకపోయాయి. ఉద్దానం ప్రాంతం మొత్తానికీ ఉద్దేశించిన మెగా తాగునీటి పథకం ద్వారా అయినా నీటి సరఫరాకు వీలుగా చర్యలు చేపడుతున్నాం. రూర్బన్ పథకంలో భాగంగా మిగిలిన వీధుల్లో రూ.2 కోట్లతో ఇంటింటా కొళాయిలు పనులు త్వరలో ప్రారంభించనున్నాం.
గతంలో తలెత్తిన ఇబ్బందులతో....
- పిరియా విజయసాయిరాజ్, జడ్పీ ఛైర్పర్సన్
గతంలో ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రూర్బన్ నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగపడలేదు. ఉద్దానం నీటి లభ్యతను అంచనా వేయకుండా చేపట్టిన పనుల మూలంగా నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెగా తాగునీటి పథకం ద్వారా ఉపరితల జలాలు సోంపేట పట్టణ ప్రజలకూ ఇంటింటా కొళాయి ద్వారా అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో