logo

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

పున్నం పంచాయతీ ఎల్లయ్యపేటకి చెందిన వి.వెంకటసురేష్‌వర్మ(37) పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Published : 25 Jan 2022 03:40 IST


వెంకట సురేష్‌వర్మ (దాచిన చిత్రం)

జి.సిగడాం, న్యూస్‌టుడే: పున్నం పంచాయతీ ఎల్లయ్యపేటకి చెందిన వి.వెంకటసురేష్‌వర్మ(37) పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సురేష్‌వర్మ సోమవారం వేకువజామున గ్రామ సమీపంలోని సర్వేశ్వర పురం కూడలి వద్ద పురుగుల మందు తాగి ఇంటికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించగా పొలాల్లో పడి ఉన్నాడు. వెంటనే చీపురుపల్లి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పిల్లలు లేకపోవడం, మద్యానికి బానిసకావడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు జి.సిగడాం ఎస్‌ఐ సీహెచ్‌ రామారావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని